Don't Miss!
- News వైసీపీ షాకయ్యే పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీ.. ఈసీకి ఫిర్యాదు.. ఎందుకంటే..
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహేష్ని చిన్న పాప సైతం పెళ్లి చేసుకోమని అడుగుతోంది
హైదరాబాద్: మహేశ్బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'బ్రహ్మాత్సవం' . ఈ చిత్రం కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తెలుగు, తమిళభాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలెట్టింది టీమ్. అందులో భాగంగా...సాంగ్ టీజర్ ని విడుదల చేసారు.
'బ్రహ్మోత్సవం' చిత్రంలోని మధురం మధురం.. అనే పాట టీజర్ విడుదలైంది. చిత్ర యూనిట్ సోషల్మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... వీడియోను అభిమానులతో పంచుకుంది.
ఈ టీజర్లో మహేష్బాబు అందం చూసిన ఓ చిన్నపాప నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడుగుతున్నట్లు చిత్రీకరించారు. అంతేకాదు మహేష్ అలా నడిచి వస్తుంటే అటువైపు ఉన్న అమ్మాయిలు సైతం ఆయన్నే చూస్తున్నారు.
సమంత, కాజల్, ప్రణీత ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.పీవీపీ సినిమా, జి. మహేశ్బాబు ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి, మహేశ్బాబులు చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్బాబు, ప్రసాద్ వి. పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిక్కీ జె. మేయర్, మణిశర్మ చిత్రానికి సంగీతం అందించారు. మే 7న ఈ చిత్రం ఆడియోను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.