ఎడ్రస్ ఇచ్చిపో, నా బీరకాయ చుట్టం: మహేష్ (వీడియో)
హైదరాబాద్: మహేశ్బాబు హీరోగా నటించిన 'బ్రహ్మోత్సవం' చిత్ర ఆడియో వేడుక కార్యక్రమం ఘనంగా జరిగాయి. ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి మహేష్ బాబు తన కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నవదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఇక ఈ పంక్షన్ లో స్పెషల్ ఎట్రాక్షన్ ఎవరూ అంటే...మహేశ్ కుమార్తె సితార ప్రత్యేక అనే చెప్పాలి. సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్, నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, రావు రమేష్, రేవతి, సత్యరాజ్తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు తరలివచ్చారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్, సమంత, ప్రణీతలు ప్రధాన పాత్రలు పోషించారు.
ఇక ఈ ఆడియో విడుదల సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ చక్కగా తెలుగుతనం ఉట్టిపడేలా ఉండి, ఇట్టే ఆకట్టుకుంటోంది. అలాగే ఈ సమ్మర్ కు ఖచ్చితంగా హిట్ కొట్టే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్దమవుతోంది.
సమంత, కాజల్, ప్రణీత ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.పీవీపీ సినిమా, జి. మహేశ్బాబు ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి, మహేశ్బాబులు చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్బాబు, ప్రసాద్ వి. పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిక్కీ జె. మేయర్, మణిశర్మ చిత్రానికి సంగీతం అందించారు. మే 7న ఈ చిత్రం ఆడియోను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











