Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నా భార్యను లైట్ తీస్కోండి: సుహాసిని వ్యాఖ్యలపై మణిరత్నం
హైదరాబాద్: మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓకే బంగారం' సినిమా రేపు(ఏప్రిల్ 17) గ్రాండ్ గా విడుదలవుతున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఆడియోకు మంచి స్పందన వచ్చింది. ఈనేపథ్యంలో ఆడియో సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు.
ఫేస్బుక్
ద్వారా
లేటెస్ట్
అప్డేట్స్
ఎప్పటికప్పుడు
అంతకు
ముందు
ఓ
ప్రెస్
మీట్లో
సుహాసిని
ఈ
సినిమా
గురించి
మాట్లాడుతూ....క్వాలిఫైడ్
పీపుల్
మాత్రమే
‘ఓకే
బంగారం'
రివ్యూ
రాయాలి
అంటూ
కామెంట్
చేసారు.
ముఖ్యంగా
ఈ
మధ్య
కాలంలో
సోషల్
మీడియాలో
ఎవరికి
నచ్చినట్లు
వారు
సినిమాలపై
తమ
తమ
రివ్యూలు
రాస్తున్న
నేపథ్యంలో
సుహాసిని
ఈ
వ్యాఖ్యలు
చేసారు.
ఈ నేపథ్యంలో...సుహాసిని వ్యాఖ్యలపై ఆడియో సక్సెస్ మీట్లో మణిరత్నంపై ప్రశ్నల వర్షం కురిపించారు పాత్రికేయులు. దీనికి ఆయన స్పందిస్తూ... ‘సోషల్ మీడియాలో ఎవరైనా తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించవచ్చు. వాళ్లని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. సుహాసిని మాటలను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సినిమా కంటెంట్ బావుంటే అందరికీ నచ్చుతుంది' అని చెప్పుకొచ్చారు.
మణిరత్నం దర్శకత్వంలో నిత్యమేనన్, సల్మాన్ దుల్కర్ జంటగా నటించిన చిత్రం 'ఓకే బంగారం'. ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆడియో సక్సెస్మీట్ను హైద్రాబాద్లోని తాజ్డెక్కన్లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి దర్శకుడు మణిరత్నం, పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీత దర్శకుడు రెహమాన్, హీరో నాని, హీరోయిన్ నిత్య మేనన్, నటుడు ప్రకాష్ రాజ్, నిర్మాత దిల్రాజ్ హాజరై మాట్లాడారు.