కళాభవన్ మణి పోస్ట్ మార్టం రిపోర్ట్
త్రిసూరు: కళాభవన్ మణి మృతిపై నిన్న రాత్రి నుంచి రకరకాల రూమర్స్, వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆయన విషం తీసుకుని మరణించారని అని మీడియాలో గుప్పు మంది. దాంతో ఆయన అభిమానులు కంగారు పడ్డారు. అయితే మణి స్నేహితులు దిలీప్ వంటివారుఖండించారు. అయితే నిజం ఏమిటనేది సస్పెన్స్ గానే ఉండిపోయింది. ఇప్పుడు సస్పెన్స్ వీడింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది.
పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం...కళా భవన్ మణి...సీరియస్ లివర్ ప్లాబ్లంలతో బాధపడ్డారు. ఆయన లివర్ పూర్తిగా డామేజ్ అయ్యిపోయింది. లిక్కర్ తీసుకున్న లివర్ పంక్షన్ కు ఇబ్బంది ఎదురై.. తర్వాత ఆ యన రక్తం వాంతి చేసుకున్నారు. ఆయన విషం తీసుకున్నారనే విషయం నిజమా కాదా అని తెలుసుకోవటానికి ఇంటర్నెల్ ఆర్గన్స్ ని ఫోర్సనిక్ ఎగ్జామిన్ చేసారు. ఆ రిపోర్ట్ లలో ఏముందంటే...

ఆయన శరీరంలో పాయిజన్ కనపడటానికి కారణం.. ఆయన ఎప్పటినుంచో వాడుతున్న మందులన నుంచి వచ్చి ఉండవచ్చు అన్నారు. ఈ విషయాన్ని ఖరారు చేసుకోవటానికి ఆయన ఇంటర్నెల్ అవయవాలను కొచ్చిలోని ఓ ఫోరిన్సిక్ ల్యాబ్ కు పంపటం జరిగింది.
ఈ మధ్యలో పోలీసులు... మణి తో కలిసి లిక్కర్ తీసుకున్న ఓ మిమిక్రి ఆర్టిస్టు మరికొంత మంది స్నేహితుల స్టేట్ మెంట్ రికార్డ్ చేసారు. ఇంకా పరిశోధన జరుగుతూ ఉంది. వాటి వివరాలు రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











