Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాలీవుడ్ నటుడు మనోజ్కుమార్కు ఆపరేషన్
ఇక ఆ మధ్య షారుఖ్ఖాన్పై ఆనాటి స్టార్ హీరో మనోజ్కుమార్ మరోసారి మండిపడ్డారు. రూ. 100 కోట్ల మేర పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమయ్యారు. షారుఖ్, ఈరోస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్మించిన 2007 నాటి సూపర్ హిట్ ఫిల్మ్ 'ఓం శాంతి ఓం'లో తనని అనుకరిస్తూ షారుఖ్ చేసిన పేరడీ సన్నివేశాల్ని తొలగించకుండా జపాన్లో ఆ సినిమాని విడుదల చేసారని ఆయన సీరియస్ అయ్యారు.
ఆ సినిమాని అప్పట్లో శాటిలైట్ చానల్స్లో ప్రసారం చేయడానికి ముందుగానే తనకి సంబంధించి పేరడీ సన్నివేశాల్ని తొలగించాలంటూ ఆయన కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అవి పట్టించుకోకుండా ప్రసారం చేస్తున్నారు. జపాన్ లోనూ విడుదల చేసారు. ఇవన్నీ ఈ సీనియర్ హీరోని సీరియస్ అయ్యేలా చేసాయి.
మనోజ్ కుమార్ మాట్లాడుతూ... "ఆ సన్నివేశాల్ని తొలగించకుండా జపాన్లో 'ఓం శాంతి ఓం'ను రిలీజ్ చేశారు. ఇప్పటికే వాళ్లను రెండుసార్లు క్షమించాను. ఈసారి అలా చేయలేను. వాళ్లు నన్ను అగౌరవ పరిచారు. అన్ని ప్రింట్లు, ప్రసార కాపీల నుంచి ఆ సన్నివేశాల్ని తొలగించమని 2008లోనే కోర్టు తీర్పునిచ్చింది. అందువల్ల వారు కోర్టు ధిక్కార నేరాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. రూ. 100 కోట్ల పరువు నష్టం కోరుతూ షారుఖ్, ఈరోస్ ఇంటర్నేషనల్పై రేపు సివిల్, క్రిమినల్ కేసుల్ని వేయబోతున్నాను'' అని చెప్పారు .