Don't Miss!
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- News ఐటీ హబ్ శివార్లలో 647 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్, సీఎం సంచలన నిర్ణయం?
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మంచు మనోజ్ టీజర్ ఎందుకు రిలీజ్ చేయలేదు..? అమ్మ మరణం వల్లనే అని....
జయలలిత వంటి గొప్ప నాయకురాలిని కోల్పోవడం వలన గుంటూరోడు టీజర్ రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు మనోజ్ చెప్పాడు.
డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్, కొద్దికాలంగా హిట్ కోసం ఎంతగానో తపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తనకు మంచి గుర్తింపు తెచ్చిన డిఫరెంట్ కమర్షియల్ సినిమానే నమ్ముకొని 'ఒక్కడు మిగిలాడు', 'గుంటూరోడు' అన్న రెండు సినిమాలను సిద్ధం చేస్తున్నారు. మంచు మనోజ్ కథానాయకుడిగా 'గుంటూరోడు' సినిమా రూపొందింది. సత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ నటించింది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, ఆ తరువాత పనులను వేగంగా జరుపుకుంటోంది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. మనోజ్ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా.. సంపత్, కోట శ్రీనివాస రావు, రావు రమేష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి మోషన్ పోస్టర్ విడుదల చేయగా దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా నుంచి ఈ నెల 7వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయాలనుకున్నారు. గుంటూరులో ఒక వేడుక ద్వారా ఈ టీజర్ ను వదలాలని నిర్ణయించుకున్నారు. అయితే దేశం జయలలిత వంటి గొప్ప నాయకురాలిని కోల్పోవడం వలన, టీజర్ రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు మనోజ్ చెప్పాడు. టీజర్ రిలీజ్ కి కొత్త డేట్ ఎప్పుడనేది త్వరలో చెబుతామని అన్నాడు.