Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
బాలకృష్ణ సరసన సునీల్ హీరోయిన్ ఎంపిక
సునీల్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన 'మర్యాద రామన్న' చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టన భామ సలోని. అయితే ఆ చిత్రం తర్వాత ఆమెకు చెప్పుకోతగ్గ ఆఫర్స్ రాలేదు. తెలుగుఅమ్మాయి అనే చిత్రంలో చేస్తున్న ఈమె తాజాగా బాలకృష్ణ చిత్రంలో ఒక హీరోయిన్ గా బుక్కయ్యింది. శ్రీకీర్తి కంబైన్స్ సంస్థ పతాకంపై ఎమ్.ఎల్.పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఒక హీరోయిన్ ఇప్పటికే లక్ష్మీరాయ్ ఎంపికైంది. మరో హీరోయిన్ గా సలోనిని ఎంపికచేసారు. ఈ విషయంపై తన ఆనందాన్నివ్యక్తం చేస్తూ "బాలకృష్ణతో కలిసి నటించాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నా. ఆ అవకాశం ఇప్పటికి దొరికింది. మాస్ మసాలా పాత్రలో కనిపిస్తాను. ఇప్పటివరకు చేయని ఒక వైవిధ్యమైన పాత్ర ఈ సినిమాతో దక్కడం ఆనందంగా ఉంది. ఈ నెల 11 నుంచి షూటింగ్ లో పాల్గొంటానని చెప్తోంది. ఈ చిత్రంలో జయసుధ, నదియా, ప్రదీప్రావత్, ఆదిత్య మీనన్, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సమర్పణ: సందీప్, సంగీతం: కల్యాణిమాలిక్.