Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'మర్యాదరామన్న' రీమేక్ కు ఎనభై కోట్లు
రాజమౌళి, సునీల్ కాంబినేషన్ లో వచ్చి హిట్టైన మర్యాద రామన్న చిత్రం హిందీలోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఎస్.ఓ.ఎస్ (సన్ ఆఫ్ సర్ధార్) తో రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ఇప్పటికే ఎనభై కోట్ల వరకూ బిజినెస్ ఆఫర్ వచ్చిందని, సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకముందే ఈ రేంజి బిజినెస్ కావటం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. దీనికి కారణం అజయ్ దేవగన్ రీసెంట్ చిత్రం సింగం అని చెప్తున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా రూపొందిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఎఫెక్ట్ మర్యాద రామన్న రీమేక్ పై పడింది. ఆ చిత్రాన్ని అజయ్ దేవగన్ తో అతిధి తుమ్ కబ్ జావోగి అనే కామిడీ చిత్రం రూపొందించిన అశ్విని ధిర్ డైరక్ట్ చేస్తున్నాడు. అయితే హిందికి తగినట్లు కొన్ని మార్పులు చేస్తున్నట్లు చెప్తున్నారు. హీరోయిన్ ని ఎంపిక చేసి షూటింగ్ ప్రారంభిస్తామంటున్నారు.