మోహన్ బాబు...బఫెల్లో లాగ తింటున్నారు
హైదరాబాద్: సార్..గేదెలు, మేకలు ఎప్పుడూ తింటాయండి..సింహం ఒకేసారి తింటుంది అని మోహన్ బాబు గారితో ఆయన ఫుడ్ హాబిట్స్ గమనించి అన్నాను. ఆయన చాలా షాక్ అయ్యారు అంటున్నారు వర్మ. అలాగే నేను ఎప్పుడు నిలబడే ఉండి పని చేస్తూంటాను. మీరు కూర్చునే ఉంటారు. నేను ఎప్పుడూ టైర్ అవటం ,నీరసం రావటం వంటి వాటితో ఉండను.
మీరు ఓ బఫెల్లో లాగ తిండి తింటున్నారు. అందుకే అలా జరుగుతోంది. మీరు కంటిన్యూగా తింటున్నారు. కానీ రుచి కోసం తినటం లేదు. ఇది వరస్ట్ కండీషన్. సింహం ఒకసారే తింటుంది. అది రుచి చూసుకోదు. కేవలం బ్రతకటంకోసమే తింటుంది. అందుకే సింహం అన్నిటికంటే, అందరికంటే ఆరోగ్యంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చానని వర్మ రీసెంట్ గా ఓ వెబెసైట్ కు ఇచ్చిన ఓ ఇంటర్వూలో అన్నారు.

వర్మ చిత్రాల విషయాలనికి వస్తే...
కిల్లింగ్ వీరప్పన్ సక్సెస్ తో ఉత్సాహంతో ఉన్న సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీసారు. గతంలో అనంతపురం ఫ్యాక్షన్ గొడవలను ‘రక్త చరిత్ర' సినిమాగా తీసి హిట్ కొట్టిన వర్మ ఇప్పడు వంగవీటి మోహన్ రంగా జీవితంపై సినిమా మొదలెట్టపబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్ ద్వారా తెలియచేసారు.
రంగా రాజకీయ ఆరంగ్రేటం మొదలు రంగా హత్యకు దారితీసిన పరిణామాలు, రంగా హత్యతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వర్మ తన సినిమాలో చూపించనున్నాని చెప్తున్నారు. రంగా సోదరుడు రాధాకృష్ణ హత్యతో ఈ కథ ప్రారంభమై రంగా హత్యతో ముగుస్తుందని వర్మ తెలిపారు.


Click it and Unblock the Notifications











