Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ప్రియాంకను బంగారు గాజులతో సన్మానించిన మోహన్ బాబు
న్యూఢిల్లీ: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పద్మశ్రీ అవార్డు అందుకున్న సందర్భంగా , కాంగ్రెస్ ఎంపీ టి. సుబ్బిరామిరెడ్డి ప్రియాంకను ఢిల్లీలోని తాజ్మహల్ హోటల్లో సత్కరించారు. ఈ కార్యక్రమంకు మోహన్బాబు, ఆయన తనయ మంచు లక్ష్మీ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంలో సుబ్బిరామిరెడ్డి కుమార్తె పింకీ రెడ్డి , నటుడు మోహన్ బాబు .. ప్రియాంకకు బంగారు గాజులు తొడిగి సన్మానించారు. మోహన్ బాబు తనపై చూపించిన ఆత్మీయ ఆదరణకు పులకించిన ప్రియాంక ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఇంకా ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా, బ్రిటీష్ హై కమీషనర్ సర్ డోమ్నిక్, పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరైనట్టు సమాచారం. ప్రియాంక బేవాచ్ అనే హాలీవుడ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
'సాత్ ఖూమ్ మాఫ్' చిత్రంలో ప్రియాంక కనబరచిన అద్భుత నటనకుగాను 2011లో ఈమెకు మొదటి దాదా సాహెబ్ పాల్కే అవార్డు వచ్చింది. ఇప్పుడు తాజాగా ప్రియాంక 'బాజిరావ్ మస్తాని'లో కాశీ భాయ్గా నటించి మెప్పించిన ఆమెకు ఈ ఏడాది ఉత్తమ నటి కేటగిరిలో దాదా సాహెబ్ పాల్కే అవార్డు దక్కింది.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రియాంక పద్మ పురస్కారం స్వీకరించిన నేపథ్యంలో సుబ్బరామి రెడ్డి ఢిల్లీలో విందు ఏర్పాటు చేసి ఈ గాజులు బహుమతిగా ఇచ్చి ఘనంగా సత్కరించారు. సుబ్బిరామిరెడ్డికి కళాకారులంటే చాలా మక్కువ. అందుకే వారికి తరచూ అవార్డులు, సన్మానాలు, సత్కారాలు చేస్తుంటారు.