Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వరుణ్ సందేశ్కు మోహన్ బాబు వార్నింగ్, ఎందుకు?
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుర్ర హీరో వరుణ్ సందేశ్కు వార్నింగ్ ఇచ్చాడట. అయితే, అది జరిగి చాలా కాలమే అవుతోంది. ఆ విషయం అప్పుడు బయటకు రాలేదు. కానీ ఇటీవల వరుణ్ సందేశ్ ఆ విషయాన్ని వెల్లడించాడు.
ఇదే తప్పు మళ్లీ చేస్తే ఈ సారి వార్నింగ్ ఇవ్వడం కాదు, వేరొకటి జరుగుతుందని మోహన్ బాబు ఆయన్ను హెచ్చరించాడు. మోహన్బాబుతో కలిసి వరుణ్ సందేశ్ 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమాలో నటించాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒకరోజు సాయంత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత హీరోలు వరుణ్, తనీష్లు, హాస్యనటుడు కిశోర్ ఒక గదిలో బెడ్పై విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఇంతలో ఆ గదిలోకి వచ్చిన మనోజ్ ఎగిరి వాళ్లపై సరదాగా పడ్డాడట. దాన్ని మోహన్ బాబు చూశాడట. వెంటనే అందరినీ తన గదికి పిలిచారట. వారంతా గదిలోకి బిక్కు బిక్కుమంటూ వెళ్లారట. ఇంకేముంది, మొట్టి కాయలు తప్పలేదు.
'అదేంటయ్యా.. అలా పడుకున్నారు. సినిమా నటుడంటే ఎలా ఉండాలి. డిగ్నిఫైడ్గా ఉండాలయ్యా. ఇది మళ్లీ రిపీట్ అయ్యిందా.. ఈసారి వార్నింగ్ ఇవ్వను' అని హెచ్చరించారట. ఈ విషయాన్ని వరుణ్ సందేశ్ ఇటీవల ఒక టీవీ షోలో స్వయంగా చెప్పాడు.