Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘మన్యం పులి’ హిట్.. ఈ నెల్లోనే మోహన్ లాల్ మరో మూవీ వస్తోంది!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన మలయాళ మూవీ 'పులి మురుగన్' తెలుగులో 'మన్యం పులి'గా విడుదలైన సంగతి తెలిసిందే. మోహన్ లాల్ నటించిన మరో మలయాళ చిత్రం తెలుగులో విడుదలకు సిద్దమవుతోంది.
2016 ఓనం కానుకగా విడుదలైన 'ఒప్పం' చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నిర్మాత దిలీప్ కుమార్ బొలుగోటి ఈచిత్రం తెలుగు హక్కులు దక్కించుకున్నారు. ఈ చిత్రానికి 'కనుపాప' లేదా 'వాచ్ మెన్ జైరాం' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.
ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఒప్పం' చిత్రంలో మోహన్ లాల్ అంధుడిగా కనిపించబోతున్నారు. ఈ సినిమాను నూతన సంవత్సర కానుకగా డిసెంబర్ 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
మోహన్ లాల్ , సముతిరాకని, అనుశ్రీ, విమలారామన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం 'ఒప్పం'. ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొంది రిలీజైన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. సెప్టెంబర్ 8న విడుదలైన ఈ చిత్రం మొదటి 15 రోజుల్లోనే 23.7 కోట్లు గ్రాస్ వసూలు చేసి , మళయాళ సూపర్ హిట్ మూవి ప్రేమమ్ రికార్డ్ ని క్రాస్ చేసింది. ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టింది.
ఈ చిత్రం తమిళ రీమేక్ ని కమల్, హిందీలో అక్షయ్ చేయటానికి ఆసక్తిచూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో ప్రక్క ఈ చిత్రం బెంగాళి రైట్స్ ని ఓ కార్పోరేట్ సంస్ద చేజిక్కించుకోగా, కన్నడ రైట్స్ ని కూడా అమ్ముడుపోయినట్లు సమాచారం. కన్నడంలో ఓ తెలుగు దర్శకుడు ఈ రీమేక్ చేస్తాడని వినపడుతోంది.
ఇక తెలుగు విషయానికి వస్తే... ఈ చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ కోసం వెంకటేష్ వంటి హీరోలు,సాయి కొర్రపాటి వంటి స్టార్ నిర్మాతలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఓవర్ సీస్ నెట్ వర్క్ ఎంటర్టైన్మెంట్స్ బి.దిలీప్ కుమార్ తో కలిసి మోహన్ లాల్ ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలు ఈ చిత్రం రీమేక్ చేయటానికి ఆసక్తి చూపెడుతున్నా..మోహన్ లాల్ మాత్రం రైట్స్ ఇవ్వటానికి పెద్దగా ఆసక్తి చూడటం లేదని వినికిడి. జనతాగ్యారేజ్, మనమంతా, మన్యంపులితో తనకు తెలుగులో ఏర్పడ్డ మార్కెట్ తో ఈ సినిమాని ఇక్కడ బిజినెస్ చేసి విడుదల చేయాలనకుంటున్నారు.