Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వంద రోజుల వైపు పరుగులు తీస్తున్న ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్
''వినోదం, సంగీతం, కుటుంబ బంధాలు... వీటితో అల్లుకొన్న కథ 'మిస్టర్ పర్ఫెక్ట్'. ఈ సినిమా కోసం రెండేళ్లపాటు కష్టపడ్డాం. దానికి తగిన ప్రతిఫలం వచ్చిందంటున్నారు" దిల్ రాజు. ఆయన నిర్మించిన చిత్రం 'మిస్టర్ పర్ఫెక్ట్'. ప్రభాస్ కథానాయకుడు. కాజల్, తాప్సి నాయికలు. దశరథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇటీవలే 50 రోజుల మార్కు అందుకొంది.
ఈ సందర్భంగా దిల్రాజు మాట్లాడుతూ ''పైరసీ బెడద ఎక్కువగా ఉంది. మరోవైపు కొత్త చిత్రాల తాకిడి. వీటి మధ్య కూడా మా 'మిస్టర్ పర్ఫెక్ట్' విజయం సాధించడం ఆనందంగా ఉంది. ప్రభాస్ని ఇది వరకు చూడని కోణంలో చూపించాం. నటీనటుల సహకారం, సాంకేతిక నిపుణుల నైపుణ్యం విజయాన్ని తెచ్చిపెట్టాయి. 130 కేంద్రాలలో యాభై రోజులు పూర్తిచేసుకొని వంద రోజుల వైపు పరుగులు తీస్తోంది. మంచి చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అనేదానికి మా సినిమానే నిదర్శనం'' అన్నారు.