చంపేస్తామని బెదిరించారు: వర్మ
హైదరాబాద్: వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘కిల్లింగ్ వీరప్పన్' బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ఈ సందర్భంగా ఆయన చేసిన ఓ ట్వీట్ ఆకట్టుకుంటోంది. ‘కిల్లింగ్ వీరప్పన్ మూవీ విషయంలో ఏమైనా తేడా వస్తే నన్ను చంపేస్తామని బెదిరించారు. అందుకే సినిమాను జాగ్రత్తగా తీసాను' అని వర్మ ట్వీట్ చేసారు. ఆయన్ను అలా బెదిరించింది చిత్ర యూనిట్ సభ్యులేనంట.
బాక్సాఫీసు వద్ద కిల్లింగ్ వీరప్పన్ భారీ సక్సెస్ కావడంతో అంతా పార్టీ చేసుకున్నారు. వీరప్పన్ మరణాన్ని మందు, విందుతో సెలబ్రేట్ చేసుకున్నారు.
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావును సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కలిశారు. ఈ విషయాన్ని దాసరి తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపారు. వర్మ దర్శకత్వం వహించిన ‘కిల్లింగ్ వీరప్పన్' చిత్రాన్ని తాను చూశానని దాసరి పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











