Don't Miss!
- News టీడీపీలో ప్రకంపనలు..పార్టీకి గుడ్ బై చెబుతున్న నేతలు
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
మహానటి సక్సెస్ మీట్: సావిత్రి లైఫ్ చూసి షాక్ తిన్నా.. గర్వంగా ఉంది..
లెజండరీ యాక్ట్రెస్ సావిత్రి జీవిత నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం మహానటి. కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ మనసులు గెలుచుకుంది ఈ చిత్రం మహానటి. సినిమా విడుదలై మూడో వారంలోకి అడుగుపెట్టినా ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సంధర్బంగా చిత్ర యూనిట్ మీడియాతో సమావేశం అయ్యారు. నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్, దర్శకుడు నాగ్ అశ్విన్, హీరోయిన్ కీర్తి సురేష్, హీరో విజయ్ దేవరకొండ, రచయిత బుర్రా సాయి మాధవ్ ఈ సక్సెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది.
నాగ్ అశ్విన్ మాట్లాడుతూ...
జనాలు వచ్చి సినిమాను చూస్తారని ఆశించాం. నేను ఏదైతే అనుకున్నానో ఆడియన్స్ అదే ఫీల్ అవుతున్నారు. డైరెక్టర్ గా నాకు హ్యాపీగా ఉంది. ఈ సినిమాకు భాగం అయినందుకు గర్వంగా ఉంది. సినిమాను వెనక ఉండి నడిపించిన అందరికి థాంక్స్ చెబుతున్నాను. సినిమా మొదలైన దగ్గరి నుండి అందరు బాగా సపోర్ట్ చెయ్యడం జరిగింది.
కీర్తి సురేష్ మాట్లాడుతూ...
నన్ను సపోర్ట్ చేస్తున్న మీడియాకు ధన్యవాదాలు. డైరెక్టర్ నాగి, స్వప్న, ప్రియాంక నాకు అందించిన సహకారం మరువలేనిది. సాంకేతిక నిపుణులందరికి ధన్యవాదాలు. అమ్మ, నాన్నలకు థాంక్స్. వారి సహకారం మరువలేనిది. అందరు కష్టపడ్డారు కాబట్టి సినిమా విజయం సాధించింది. ఈ సక్సెస్ నేను మర్చిపోలేను.
ప్రియాంక దత్ మాట్లాడుతూ...
మంచి సినిమాలు చెయ్యదానికి ప్రయత్నం చేస్తాం. మహానటి సినిమా మాపై భాధ్యతను పెంచింది. సినిమాను విజయవంతం చేసినందుకు అందరికి ధన్యవాదాలు.
స్వప్న దత్ మాట్లాడుతూ...
మూడో వారం కూడా సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది మహానటి సినిమా. ప్రేక్షకులు చూపించిన ప్రేమకు ఇంకా మంచి సినిమాలు చెయ్యాలనే ఆలోచన వస్తోంది. రాజేంద్ర ప్రసాద్, నాగ చైతన్య ఇలా ప్రీతి ఒక్కరు మా సినిమా చేసినందుకు ధన్యవాదాలు. సపోర్ట్ చేసిన మీడియాకు పెద్ద థాంక్స్.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ...
సావిత్రి గారి లైఫ్ చూసి నేను షాక్ అయ్యాను. వైజయంతి మూవీస్ ఈ సినిమాను నిర్మించడం గొప్ప విషయం. నాగ్ అశ్విన్ సినిమాను నడిపించిన విధానం గ్రేట్. మహానటి లాంటి సినిమాలు అరుదుగా వాస్తు ఉంటాయి. ఎవడే సుబ్రహ్మణ్యం తరువాత నాగ్ అశ్విన్ తో చేసిన సినిమా మహానటి. నాగ్ అశ్విన్ హాడ్ వర్క్ నేను దగ్గరుండి చూసాను.
బుర్రా సాయి మాధవ్...
మంచి సినిమా చూసున్నారు ప్రేక్షకులు. మహానటి మంచి సినిమా. ప్రేక్షకులు న్యాయ నిర్ణేతలు. వారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా రుణం తీర్చుకోలేం. కీర్తి సురేష్ ను చూస్తుంటే సావిత్రి గారిని చూసినట్లే ఉంది. ఆడియన్స్ కు పెద్ద థాంక్స్.