Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
స్వయంగా నాగార్జునే చెప్పాడు, నానితో నాగ్ కలిసి సినిమా కన్ఫార్మ్
ఈ మధ్య టాలీవుడ్ లో మల్తీ స్టారర్లకి కాస్త ఆదరణ పెరుగుతోందనే చెప్పాలి ఒకరితో ఒకరు కలిసి నటించేందుకు మన హీరోలూ ఉత్సాహం చూపిస్తున్నారు.
ఈ మధ్య టాలీవుడ్ లో మల్తీ స్టారర్లకి కాస్త ఆదరణ పెరుగుతోందనే చెప్పాలి ఒకరితో ఒకరు కలిసి నటించేందుకు మన హీరోలూ ఉత్సాహం చూపిస్తున్నారు. అదే క్రమం లో నాని, నాగార్జున కలిసి ఒక సినిమా చేయబోతున్నారనే టాక్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందో లేదో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఆ సినిమాపై సందేహాలను పటాపంచలు చేస్తూ నాగ్ ఓ ప్రకటన చేశాడు. నానితో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నానని ప్రకటించాడు.
నానితో కాంబో సినిమా పై వస్తున్న పుకార్లకు నాగ్ క్లారిటీ ఇచ్చాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఓ మల్టీస్టారర్ చేయబోతున్నానని నాగ్ స్పష్టం చేశాడు. తాను నానితో కలిసి నటించబోతున్న సంగతి వాస్తవమేనని కన్ ఫర్మ్ చేశాడు. ఈ సినిమాలో నాని పాత్ర ఎంతో సరదాగా సాగిపోతుందని నాగ్ చెప్పాడు. తన పాత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుందన్నాడు. అభిమానులందరినీ ఎంటర్ టైన్ చేసేలా ఈ సినిమా ఉండబోతోందని చెప్పాడు.
'భలే మంచిరోజు', 'శమంతకమణి' సినిమాలకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. నలుగురు యంగ్ హీరోలతో శమంతకమణి సినిమాను రూపొందించి పర్వా లేదనిపించాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా, ప్రేక్షకులను అలరించింది. అదే ఊపులో నాగ్, నానిల కాంబోలో ఓ సినిమా తెరకెక్కించేందుకు ఆదిత్య సిద్ధమయ్యాడు. అశ్వనీదత్, నాగ్, నానీ ల క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి.