Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'ఏ మాయ చేసావె' సక్సెస్ తో పిచ్చహ్యాపీగా నాగచైతన్య..!!
'జోష్' సినిమాతో హీరోగా పరిచయం అయి, ఆ సినిమా కాస్త ఫట్ అనడంతో ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా హిట్ కొట్టాలనుకుని వెంటనే ఏ మాయ చేసావే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. హిట్ కోసం పరితపించిన చైతూ ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో యమా హ్యాపీగా వున్నాడు. అన్నట్టు ఈ సినిమాకు చైతన్య పారితోషికం తీసుకోకుండానే పనిచేసాడట. కానీ ఈ సినిమా శ్యాటిలైట్ హక్కులు తీసుకున్నాడట.
సినిమాకు హిట్ టాక్ రావడంతో శ్యాటిలైట్ హక్కులకు ఫ్యాన్సీ ఆఫర్ వస్తోందట. దీంతో చైతూ డబల్ హ్యాపీగా వున్నాడట. ఇక ఈ సినిమా ద్వారా పరిచయం అయిన సమంతాకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా విజయంలో ముఖ్యభూమిక పోషించిన ఆమెకు ఆఫర్లు వెళ్లువెత్తుతున్నాయట. ఇందిరా ప్రొడక్షన్స్ తర్వాత మహేష్ బాబుతో తీయనున్న సినిమాలో సమంతనే నాయికగా తీసుకోనున్నట్టు మంజుళ ప్రకటించింది. ఇక ఇప్పటికే సమంత జూ.ఎన్టీఆర్ బృందావనంలో సెకెండ్ హీరోయిన్ గా ఎంపికయింది. దీంతో ఇక సమంత టాప్ హీరోయిన్ అవ్వడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.