Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పంజాబీ రీమేక్లో నాగచైతన్య ఖరారు..డిటేల్స్
ఈ రీమేక్ లో మొదట దగ్గుపాటి రానాతో చేద్దామనకున్నా... నాగచైతన్య ని హీరోగా ఫైనలైజ్ చేసారు. ఈ విషయమై డా||డి.రామానాయుడు మాట్లాడుతూ ''పంజాబీలో విజయం సాధించిన ఈ సినిమాని తెలుగులోకి రీమేక్ చేస్తున్నాం. ఇక్కడి పరిస్థితులకు తగ్గట్గుగా మార్పులు, చేర్పులు చేస్తాం. దర్శకుడు, తారాగణం తదితర విషయాలు త్వరలో వెల్లడిస్తాము''అన్నారు.
నాగ చైతన్య సంవత్సరం తన ఇద్దరు తాతయ్యలతో కలిపే పని చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ మల్టీస్టారర్ 'మనం' మొదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఏఎన్ఆర్, నాగార్జున, నాగ చైతన్యలు నిజ జీవిత పాత్రల్లో తాత, తండ్రి, మనవడుగా నటిస్తున్నారు. ఇదే సంవత్సరం మరో తాతయ్య రామానాయుడుతో కలిసి సినిమా చేసే అవకాశం దక్కడం విశేషం.
మరో ప్రక్క ఇటీవల నితిన్తో 'గుండె జారి గల్లంతయ్యిందే' లాంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన విజయ్ కుమార్ కొండ త్వరలో నాగ చైతన్యతో సినిమా చేయబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి పతాకంపై నాగార్జున అక్కినేని ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారు. అక్బోబర్ నెలలో ఈచిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. హీరోయిన్, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగాల్సి ఉంది. ప్రస్తుతం దర్శకుడు స్క్రిప్టు వర్కుపై దృష్టి పెట్టాడు. ఇది పూర్తయిన వెంటనే షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇవి కాకుండా నాగ చైతన్య, హన్సిక జంటగా సినిమా తెరకెక్కబోతోంది. ఇంతకు ముందు నాగార్జునతో 'డమరుకం' చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీనివాసరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. నిర్మాత సి. కళ్యాణ్ శ్రీశుభశ్వేత ఫిలింస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.