Don't Miss!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
ఆ రెండు సినిమాలు వాయిదా వెనక నాగార్జున హ్యాండ్?
హైదరాబాద్: కోన వెంకట్ సమర్పణలో తెరకెక్కిన ‘శంకరా భరణం' మూవీ వాస్తవానికి దీపావళికి విడుదల కావాల్సి ఉంది. అఖిల్ సినిమా విడుదల ఉండటంతో నవంబర్ 20కి వాయిదా వేసారు. ఇపుడు ఏకంగా డిసెంబర్ 4కు పోస్ట్ పోన్ చేసారు. కమల్ హాసన్ ‘చీకటి రాజ్యం' మూవీ కూడా దీపావళికి విడుదల కావాల్సి ఉండగా ఉండగా ‘అఖిల్'కు లైన్ క్లియర్ చేయాలని రిలీజ్ ఈ నెల 20కి వాయిదా వేసారు. దీంతో 20న విడుదల కావాల్సిన శంకరాభరణం డిసెంబర్ 4కు పోస్ట్ పోన్ చేసారు.
‘శంకరా భరణం' సినిమాను డిసెంబర్ 4కు వాయిదా వేసామని, కేవలం ‘అఖిల్' సినిమాకు గ్రాండ్ వెల్ కం చెప్పాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోన వెంకట్ ప్రకటించారు. అదే సమయంలో ‘చీకటి రాజ్యం' సినిమాను నవంబర్ 20కి వాయిదా వేసామని, తమిళ వెర్షన్ యధావిధిగా నవంబర్ 10న విడుదలవుతుందని తెలిపారు.
మరో వైపు తమిళంలో అజిత్ నటించిన ‘వెండలమ్' తెలుగులో ‘ఆవేశం' పేరుతో విడుదల కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడ సినిమా రిలీజ్ చేసే పరిస్థితి లేక పోవడం ఆగినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలన్నింటి వాయిదా వేనక నాగార్జున హ్యాండ్ ఉన్నట్లు సమాచారం.
తన వారసుడు ‘అఖిల్' తెరంగ్రేటం చేస్తున్న సినిమా కావడంతో నాగార్జున స్వయంగా రంగంలోకి దిగి తన కొడుకు సినిమాకు పోటీగా నిలుస్తాయనుకున్న ఇతర సినిమాలను రిక్వెస్ట్ చేసి వాయిదా వేయించారని అంటున్నారు. ఒక సినిమా విషయంలో నాగార్జున ఈ రేంజిలో లాబీ జరుపడం ఇదే తొలిసారి అని టాక్.స
వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖిల్' సినిమాలో అఖిల్ అక్కినేని, సాయేషా జంటగా నటిస్తున్నారు. యంగ్ హీరో నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పెద్ద హీరోల సినిమాలతో సమానంగా భారీ బడ్జెట్ ఖర్చు చేయించారు. భారీ తారాగణం, పాపులర్ టెక్నిషియన్స్, ఫారన్ షూటింగుల కోసం బాగా ఖర్చు చేసారు.
గతంలో ఏ స్టార్ హీరో వారసుడికీ లేనంతగా అఖిల్ అక్కినేని సొంతంచేసుకోవడం గమనార్హం. సినిమా విడుదల ముందే ఈ చిత్రం రూ. 45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమాపైనే తన కొడుకు సినీ భవిష్యత్ ఆధార పడి ఉండటంతో నాగార్జున వీలైనంత వరకు కిందకి దిగాడని అంటున్నారు. అఖిల్ సక్సెస్ అయితే భవిష్యత్తులో ప్రస్తుతం మహేష్ బాబు లాగా.... టాలీవుడ్ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదుగుతాడని అంటున్నారు.