హీరో నాగార్జునకు మాటీవీలో ప్రధానమైన వాటా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల టీవీ చానళ్ళ మధ్య పోటీ పెరిగిన నేపధ్యంలో మాటీవీ కొంచెం వెనుకబడింది. మాటీవీని గట్టెక్కించడానికి నాగార్జున కొన్ని కొత్త కార్యక్రమాలు ప్రారంభించారు. ఆయన యువ కళాకారులను ప్రోత్సహించడంతో పాటు తన తండ్ర్ర్తి అక్కినేని నాగేశ్వరరావుతో ఒక మంచి ప్రోగ్రాం ను డిజైన్ చేసుకున్నారు. ఆ కార్యక్రమం పేరు "గుర్తుకొస్తున్నాయి". ఎఎన్నార్ చిత్ర సీమలో తనకున్న అనుబంధం, అనుభవాలను ఈ కార్యక్రమంలో నెమరేసుకుంటున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో తండ్రీ కొడుకులు ఇద్దరూ ఆనందంగా ఉన్నారు.