Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆ పాట వింటే రోజంతా ఉత్సాహమే:నాగార్జున
అలాగే ఈ చిత్రంలో నటించడం మొదలుపెట్టిన తర్వాత సాయిబాబా జీవితం గురించి చాలా విషయాలు తెలుసుకున్నానని నాగ్ అన్నారు. శ్రీకాంత్, శ్రీహరి, సాయికుమార్ తదితరులు కీలక పాత్రలు చేశారు. సెప్టెంబర్ 6న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాగార్జున తాజాగా 'శిరిడి సాయి'అనే భక్తి రస చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున కీ రోల్ చేస్తున్నఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కులుమనాలిలో చిత్రీకరణ సాగుతోంది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం లో నాగార్జునపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు.
ఈ చిత్రం విషేషాలు నిర్మాత ఎ.మహేష్రెడ్డి మాట్లాడుతూ ''బాబా జీవిత ఘట్టాల్నే కాదు.. ఆయన మహిమల్ని కూడా తెరపై ఆవిష్కరించే చిత్రమిది. నిత్యం సాయి దివ్యనామాన్ని జపించే భక్తులు ఎంతో మంది ఉన్నారు. వారితో బాబాకి ఉన్న అనుబంధాన్ని కూడా ఇందులో చూడొచ్చు. బాబా జీవితం సాత్వికమైనది. ఆ పాత్రలో నాగార్జున ఇమిడిపోయిన విధానం అందరినీ మెప్పిస్తుంది. సాయిబాబా పాత్రకోసం నాగార్జున ఎన్నో జాగ్రత్తలు తీసుకొని నటిస్తున్నారు''అన్నారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సమర్పణ: సులోచనారెడ్డి, ఛాయాగ్రహణం: ఎస్.గోపాల్రెడ్డి, కళ: భాస్కరరాజు, శ్రీకాంత్, సంగీతం: కీరవాణి.