Don't Miss!
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నా మంచి నిర్ణయాల్లో ఇదీ ఒకటి:నాగార్జున
నాగార్జున కెరీర్ లో చెప్పుకొతగ్గ చిత్రాల్లో మొదటి వరసలో నిలిచే చిత్రం 'గీతాంజలి'. ఈ సినిమా వచ్చిన కొత్తలో ఇదేంటి నాగార్జున ఇలాంటి సినిమా చేశాడు. అప్పటివరకు డ్రీమ్ బోయ్ గా, యాక్షన్ హీరో గా కనిపించిన నాగ్ ఇలా అయిపోయాడేంటి అనుకున్నారు. అలా అనుకున్నవాళ్లే సినిమాకు భారీ విజయాన్ని అందించారు. ఈ సినిమా వచ్చి 25 ఏళ్లు అయ్యింది. ఈ సందర్బంగా నాగార్జున నాటి రోజులు గుర్తు చేసుకున్నారు.
నాగార్జున తాజా చిత్రం విషయానికి వస్తే... అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలసి నటించిన చిత్రం 'మనం'. సమంత, శ్రియ కథానాయికలు. అన్నపూర్ణ స్డూడియోస్ సంస్థ నిర్మించింది. బాలీవుడ్ నటుడు అమితాబ్బచ్చన్ అతిథి పాత్రలో కనిపిస్తారు. విక్రమ్ కె.కుమార్ దర్శకుడు. ఎలాంటి ఆర్భాటమూ లేకుండా పాటల్ని నేరుగా మార్కెట్లోకి విడుదల చేసారు. మే 23న 'మనం' ప్రేక్షకుల ముందుకొస్తుంది. అనూప్ స్వరాలు అందించారు.
నాగార్జున మాట్లాడుతూ... ఈ చిత్రం 1920 నుంచి 2030 మధ్య వంద సంవత్సరాలలో జరిగిన కథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ చిత్ర కథాంశం ఎంతో వినోద భరితంగా ఉంటుందని తెలిపారు. పునర్జన్మ కోణం లో ఈ చిత్రం ఉంటుందని నాగార్జున అన్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రం మే 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అక్కినేని,నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రెయహీరోయిన్స్ గా నటిస్తున్నారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.