Don't Miss!
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
అమెరికాలో విడుదలైన రాజన్న...స్టోరీ ఇదే
నాగార్జున నటించిన 'రాజన్న' సినిమా డిసెంబర్ 22న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను అమెరికాలో ఒక రోజు ముందు అంటే ఈ రోజే విడుదల చేశారు. సినిమా స్టోరీ కింది విధంగా ఉంది. 1948 ప్రాంతంలో నేలకొండపల్లిలో చోటు చేసుకున్న యాదార్ధ ఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించారు.
తన పాటతో, డప్పు వాయిద్యంతో ప్రజల్లో చైతన్యాన్ని నింపే రాజన్న(నాగార్జున) అతని స్నేహితులు(ప్రదీప్ రావత్, సుప్రీత్, అజయ్) కలిసి బ్రిటిష్ ఎదురు నిలిచి తెల్లదొరలను చంపుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో భాగం అవుతారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజన్న తన సొంత ఊరైన నేలకొండపల్లికి చేరుకుంటారు. లచ్చమ్మ(స్నేహ)ను పెళ్లి చేసుకుంటాడు. వీరి సంతామనమే మల్లమ్మ(బేబి ఆనీ).
దేశం మొత్తానికి స్వాతంత్ర్యం వచ్చినా నిజాం పరిపాలనలో ఉన్న ప్రాంతం(ఇప్పటి తెలంగాణ)కు మాత్రం స్వాతంత్ర్యం రాదు. గ్రామాల్లో దొరల నిరంకుశత్వం సాగుతూ ఉంటుంది. ఇది సహించలేని రాజన్న వారికి ఎదురు తిరుగుతాడు. ఒక్కొక్క దొరను చంపుతూ ముందుకు సాగుతున్న రాజన్న నిజాం మనుషుల చేతిలో బలవుతాడు.
రాజన్న మరణంతో అతని కుటుంబాన్ని కూడా తుదముట్టించాలని చూస్తారు దొర కుటుంబీకులు. రాజన్న భార్య లచ్చమ్మ ఎలాగో అలా దొరల భారి నుంచి తన కూతురు మల్లమ్మను కాపాడి తాను బలవుతుంది. మల్లమ్మను అదే ఊరిలో ఉండే ఓ తాత కాపాడి తన మనవరాలిగా పెంచుకుంటుంటాడు. అలా పెరిగి పెద్దయిన మల్లమ్మ తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకుని పాటల రూపంలో ప్రజల్లో చైతన్యం నింపుతూ ఉంటుంది. ఈ క్రమంలో దొరల ఆగ్రహానికి గురవుతుంది. నేలకొండపల్లిపై పగబట్టిన దొరలు ఊరుమొత్తాన్ని మట్టుబెట్టాలని చూస్తారు. తన ఊరిని కాపాుడకోవడానికి మల్లమ్మ ఢిల్లీ బయల్దేరు తుంది. అప్పటి దేశ ప్రధాని నెహ్రూను కలుస్తుంది. ఆతర్వాత ఏం జరిగిందో థియేటర్లో.....చూసి తెలుసుకోండి.
అయితే సినిమా మొదలవడం మాత్రమ లచ్చమ్మ దొరల చేతిలో బలవ్వడం, మల్లమ్మను ఓ పెద్దాయన కాపాడటం దగ్గర నుంచి మొదలవుతుంది. ఇంటర్వెల్ కు ముందు రాజన్న(నాగార్జున) ఎపిసోడ్ ప్లాష్ బ్యాక్ గా చూపిస్తారు.