Don't Miss!
- Sports IPL 2024: లైట్ తీస్కో హార్దిక్.. రోహిత్ కూడా టైటిల్ గెలవలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
నాగార్జున కులుమనాలీలో ఏం చేస్తున్నారు?
నాగార్జున తాజాగా చేస్తున్న పయినం చిత్రం షూటింగ్ కులుమనాలిలో జరుగుతోంది. ఆకాశమంత ఫేమ్ రాధా మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ గత శుక్రవారం ప్రారంభమైంది. ఈ చిత్రంలో నాగార్జున ఓ పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నారు. అలాగే కీలక పాత్రల్లో బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. తమిళంలో ప్రకాష్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ఓ ధ్రిల్లర్ అనీ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లో కూర్చోబెట్టేలా రూపొందిస్తున్నామని చెప్తున్నారు. చెన్నై నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్లైట్ హైజాక్ అవటం అనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది. కొంతమంది టెర్రరిస్టులు హైజాక్ చేసి ప్రయాణీకులను పట్టుకుని జైలులో ఉన్న తమ నాయకుడిని విడుదల చేయమని కోరుతారు. అప్పుడు రంగంలోకి దిగిన ఓ పోలీస్ ఆఫీసర్ ఆ సమస్యను ఎలా పరిష్కరిచాడు అన్నదే కథనం. నాగార్జున ఇది ఒక వెరైటీ చిత్రంగా భావించి చేస్తున్నారు. ఆయన ఎంతో ఊహించి చేసిన కేడీ చిత్రం ఫెయిల్యూర్ ని ఆయన కుమారుడు నాగచైతన్య ఏ మాయ చేసావే విజయం మరిపించింది.