Don't Miss!
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
రానాతో ఆ రీమేక్ చేయడంలేదు: నందినీరెడ్డి
కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న ఓ పుకారు ఏమిటంటే....'యే జవానీ హై దివానీ' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనే ప్లాన్స్ జరుగుతున్నాయని, ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించనుందని, అక్కడ గెస్ట్రోల్లో కనిపించిన హీరో రానాను ఇక్కడ హీరోగా చూపిద్దామనే ప్రయత్నం జరుగుతోందని, సురేష్ బాబు ఈచిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నాయని' వార్తలు వినపడ్డాయి.
అయితే ఈ వార్తలను తాజాగా నందినీరెడ్డి ఖండించారు. 'యే జవానీ హై దివానీ చిత్రాన్ని తాను రీమేక్ చేయడం లేదని స్పష్టం చేసారు. జబర్దస్త్ చిత్రం తర్వాత, తన నెక్ట్స్ సినిమాకు స్క్రిప్టు రాసే పనిలో ఉన్నానని, రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టెనర్ తన రాబోయే చిత్రం ఉంటుందని'నందినీ రెడ్డి తెలిపారు.
మరో నెల రోజుల్లో తన తర్వాతి సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని, ప్రస్తుతానికి కేవలం స్క్రిప్టు పనిలో మాత్రమే ఉన్నానని, ఎవరితో చేయాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. 'యే జవానీ హై దివానీ' రీమేక్ చేస్తున్నాననే రూరమ్ ఎలా పుట్టిందో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చింది.