Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నాని 'భీమిలి కబడ్డీ జట్టు' ఏం చేస్తోంది?
తమిళంలో హిట్టయిన వెన్నెల కబడ్డి కూటం చిత్రాన్ని తెలుగులో 'భీమిలి కబడ్డీ జట్టు' పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నాని, శరణ్యామోహన్, కీర్తన, కిషోర్ ముఖ్య పాత్రలుగా మెగా సూపర్గుడ్ ఫిలిమ్స్ ప్రై. లిమిటెడ్ ఈ చిత్రం నిర్మిస్తోంది. ఇక ఈ 'భీమిలి కబడ్డీ జట్టు' షూటింగు పూర్తిచేసుకుని, డబ్బింగ్ పనుల్ని జరుపుకుంటోంది. ఈ చిత్రం ద్వారా తాతినేని సత్య దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సందర్బంగా చిత్ర సమర్పకుడు ఆర్.బి. చౌదరి మాట్లాడుతూ "దర్శకుడు సత్య ఓ చక్కని చిత్రంగా దీన్ని రూపొందించి, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ చిత్రం తర్వాత అతను పెద్ద దర్శకుల జాబితాలో చేరిపోతాడు" అని చెప్పారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం ఆడియోను ఏప్రిల్ మొదటి వారంలో ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నామనీ, సెల్వగణేశ్ చాలా చక్కని సంగీతాన్ని అందించారనీ మరో నిర్మాత పరాస్ జైన్ చెప్పారు.