మనిషన్నోడు తెలంగాణకు మద్దతివ్వాలి: నారాయణమూర్తి
మనిషన్నోడు తెలంగాణకు తెలంణాకు మద్దతివ్వాలి అంటూ....విప్లవ చిత్రాల దర్శకుడు దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి అన్నారు. తన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న 'పోరు తెలంగాణ" చిత్ర ఆడియో విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....రాష్ట్రంలో ఏ ప్రాంతంలో సమస్య ఉన్నా దాన్ని కథాంశంగా తీసుకుని ఇప్పటి వరకు సినిమాలు తీశానని, పెట్టుబడి దారుల వివక్ష కారణంగా కష్టాలు పడుతున్న తెలంగాణ ప్రాంతం పోరుబాట పట్టిన అంశాన్ని 'పోరు తెలంగాణ" సినిమాలో చూపెట్టబోతున్నట్లు తెలిపారు.
1952 నుంచి ఇప్పటి వరకూ జరుగుతున్న ఉద్యమ నేపథ్యం ఈ సినిమాలో ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి ఈ చిత్రాన్ని అంకితం ఇస్తున్నట్లు నారాయణ మూర్తి తెలిపారు. మనిషన్నోడు ఇక్కడి ప్రజలు పడుతున్న కష్టాలను అర్థం చేసుకోవాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలన్నారు.
poru telangana r narayana murthy audio release telangana పోరు తెలంగాణ ఆడియో రిలీజ్ ఆర్ నారాయణమూర్తి తెలంగాణ


Click it and Unblock the Notifications