Don't Miss!
- News వాళ్ళను తిడుతూనే.. వైఎస్ జగన్, భారతి వద్ద కోట్లలో వైఎస్ షర్మిలమ్మ అప్పులచిట్టా ఇదే!!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ప్రముఖ నటుడు నరేష్ ‘నవరసరాయ' సత్కారం
హైదరాబాద్: మహానటుడు దివంగత అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా రవీంద్రభారతిలోని శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ నటుడు నరేష్ కు అక్కినేని-శృతిలయ వెండి కిరీటం, నవరసరాయ సత్కార కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమలో తెలంగాణ రాష్ట్ర స్పీకర్ ముఖ్య అతిథిగా మధుసూదనాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ సమాజాన్ని ప్రభావితం చేసే మాధ్యమం సినిమా. ఒకప్పుడు సినిమాలు సందేశాత్మకంగా ఉండేవి. ఇప్పుడు అలాంటి సినిమాలు రావడం చాలా తగ్గిపోయాయన్నారు.
శంకరాభరణం వంటి ఎన్నో గొప్ప సినిమాలు మన సంస్కృతిని దేశదేశాలకు వ్యాప్తి చేశాయి. ఎన్నో విలక్షణ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నరేష్ ను అక్కినేని పేరిట సత్కరించడం ఆనందంగా ఉంది'' అన్నారు. సతీసమేతంగా ఈ కార్యక్రమంలో నరేష్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కె.విశ్వనాథ్,జయసుధ, మ్యూజిక్ డైరెక్టర్ కోటి, కోదండరామిరెడ్డి, సురేష్ కొండేటి, జె.వి.రాజు, ఆర్.ఎన్.సింగ్ తదితరులు పాల్గొన్నారు.