Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రైతుల కష్టాలపై ‘ఖైదీ నెం 150’ కొత్త సాంగ్, అద్భుతం....
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం 150’ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన పాటలన్నీ అభిమానులను ఉత్సాహ పరిచేలా ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన పాటలకు భిన్నంగా తాజాగా రిలీజైన ‘నీరు నీరు నీరు... రైతు
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నెం 150' సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన పాటలన్నీ అభిమానులను ఉత్సాహ పరిచేలా ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన పాటలకు భిన్నంగా తాజాగా రిలీజైన 'నీరు నీరు నీరు... రైతు కంట నీరు' అంటూ సాంగే సాంగ్ అభిమానులను కంటతడి పెట్టిస్తోంది. రైతుల కష్టాలను వర్ణిస్తూ సాంగే ఈ పాట ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. ఆ పాటపై మీరూ లుక్కేయండి.
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వి.వి.వినాయక్ దర్శకత్వ ంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మించిన ఖైదీనంబర్ 150 చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేస్తున్నామని నిర్మాత రామ్చరణ్ అధికారికంగా వెల్లడించారు. అంతకంటే ముందే ఈనెల 7న విజయవాడ- గుంటూరు మధ్యలో ఉన్న హాయ్ల్యాండ్లో ప్రీరిలీజ్ వేడుకను చేస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా రామ్చరణ్ మాట్లాడుతూ -ఖైదీనంబర్ 150 చిత్రాన్ని జనవరి 11న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం. ముందుగా ఈ సినిమాని జనవరి 12న రిలీజ్ చేయాలనుకున్నాం. అయితే ఇద్దరు అగ్రహీరోల సినిమాలు ఒకేరోజున రావడం ఇండస్ట్రీకి అంత మంచి పరిణామం కాదని నాన్నగారు చెప్పడంతో ఒకరోజు ముందుగా అంటే జనవరి 11న విడుదల చేస్తున్నాం. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ తేదీ మార్పు విషయాన్ని గ్రహిస్తారని ఆశిస్తున్నాను. అలాగే.. జనవరి 4న జరగాల్సిన ఖైదీనంబర్ 150 ప్రీరిలీజ్ ఫంక్షన్ గ్రౌండ్ పర్మిషన్ ప్రాబ్లెమ్ కారణంగా జనవరి 7న విజయవాడ - గుంటూరు మధ్యలో ఉన్న హాయ్ల్యాండ్లో చేస్తున్నాం అని తెలిపారు.
ఖైదీనంబర్ 150 చిత్రంలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించగా, తరుణ్ అరోరా విలన్గా నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటలు శ్రోతల మెప్పు పొందిన సంగతి విదితమే.