శేఖర్ కమ్ముల హీరోయిన్ కి హాలీవుడ్ ఆఫర్

By Srikanya

హైదారాబాద్ : శేఖర్ కమ్ముల చిత్రం 'గోదావరి' లో హీరో మరదలు రాజీ పాత్రలో నటించిన నీతు చంద్ర గుర్తుండే ఉంటుంది. ఆ తరవాత రాజశేఖర్‌తో 'సత్యమేవ జయతే'లో నటించింది. ఈ భామకి ఇక్కడ సక్సెస్ దక్కలేదు. తమిళంలోనూ కొన్ని చిత్రాలు చేసింది. హిందీలో 'గరమ్‌ మసాలా', '13బి' లాంటి చిత్రాలు చేసి ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకొంది. నీతు త్వరలో హాలీవుడ్‌ చిత్రంలో నటించబోతోంది.

సూపర్ హిట్స్ 'జుమాంజీ', 'జురాసిక్‌ పార్క్‌ 3', 'హనీ, ఐ ష్రంక్‌ ద కిడ్స్‌' లాంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు జో జాన్‌స్టన్‌. ఆయన త్వరలో ఓ చిత్రం తెరకెక్కించబోతున్నారు. ఇందులో ఓ పాత్ర నీతు చంద్రకి దక్కింది. ఆ కథలో భారతీయురాలి పాత్ర ఉంది.

ఈ చిత్రంలో నటించేందుకు నీతుకి ఆడిషన్‌ కూడా నిర్వహించారు. వచ్చే నెలలో లాస్‌ఏంజిల్స్‌లో షూటింగ్ ఉంటుంది. అక్కడికి వెళ్లేందుకు ఆమె ఏర్పాట్లు చేసుకొంటోంది. ఇటీవలే నీతు ఓ గ్రీకు భాషా చిత్రంలో నటించింది.

మరో ప్రక్క 'జయం'రవి, నీతూచంద్ర జంటగా అమీర్‌సుల్తాన్ దర్శకత్వంలో డిఎంకె నాయకుడు అన్బుళగన్ నిర్మించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆదిభగవాన్'. తమిళంలో విడుదలై విజయం సాధించిన ఈ చిత్రాన్ని అన్బుళగన్ స్వయంగా తెలుగులోకి అనువదిస్తున్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంతో జరుగుతున్నాయి. త్వరలో సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X