Don't Miss!
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
టెపరరీ ప్రాబ్లమ్ కి సూసైడ్ పర్మనెంట్ సొల్యూషన్..!
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రాణా, ఇలియానా జంటగా నటించిన 'నేను-నా రాక్షసి' చిత్రం ఆడియో వేడుకను ఆదివారం హైదరాబాదు, హైటెక్ సిటిలో జరిగింది. దర్శకుడు వి.వి.వినాయక్ సీడీలను విడుదల చేసి, తొలి సీడీని హీరో వెంకటేష్ కు అందించారు. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ చెబుతూ, 'ఓ ప్రొఫిషనల్ హంతకునికీ, రాక్షసి లాంటి అమ్మాయికీ మధ్య జరిగిన అందమైన కథ ఇది" అన్నారు. రాణా ఇప్పటివరకు చేసిన రోల్స్ కంటే ఇందులో డిఫరెంట్ గా చేశాడని పూరి జగన్నాథ్ చెప్పారు. టెపరరీ ప్రాబ్లమ్ కి సూసైడ్ పర్మనెంట్ సొల్యూషన్ అనే కీ రోల్ బ్యాక్ డ్రాప్ కథతో చాలా థ్రిల్లింగ్ వచ్చిందని తెలియజేశారు.
హీరో రాణా మాట్లాడుతూ, 'ఓ రోజు మిట్టమధ్యాహ్నం ఎండలో నిలబెట్టి జగన్ నాకీ కథ చెప్పారు. ఇంటికెళ్లి ఆ కథనంతా కాగితం మీద రాసుకున్నాను. అంతలా నచ్చింది నాకు"అన్నాడు. 'నేనింతవరకూ చేసిన సినిమాలలో నాకు నచ్చిన పాత్ర ఈ సినిమాలోనే చేశాను" అంది ఇలియానా. వెంకటేష్ మాట్లాడుతూ,'ఈ సినిమా పబ్లిసిటీ ట్రైలర్స్ చూస్తుంటే సినిమాలో ఏదో విషయం ఉందనిపిస్తోంది" అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రవితేజ, గోపీచంద్, రామ్, రిచా తదితరులు పాల్గొన్నారు.