‘నేను నా రాక్షసి’ రొటీన్ కి కొంచె బిన్నంగా ఆడియో ఎప్పుడంటే...!
రాణా మరియు ఇలియానా జంటగా నటిస్తున్న 'నేను నా రాక్షసి" పాటలు మధురా ఆడియో కంపెనీ ద్వారా ఏప్రిల్ 10న విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను హైదరాబాద్ లోని దుర్గం చెరువు లో చెయ్యాలనుకుంటున్నారు. ఆడియో ఫంక్షన్ ని రొటీన్ కి కొంచెం బిన్నంగా నిర్వహించనున్నారట. ప్రముఖులు వివి వినాయక్, దిల్ రాజ్ ల తో కూడిన ఒక స్పెషల్ ప్రోగ్రాం ఉంటుందని అంటున్నారు. అతని మొదటి సినిమా 'లీడర్" కి దినికి చాల డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు రాణానే కాక ఇందులో మ్యూజిక్ కూడ ఇంతవరకూ ఎప్పుడు ఉండని విధంగా ఉండటం కోసం ముగ్గురు (రెహమాన్, విశ్వాస్ మరియు విశాల్-షేఖ)బడా మ్యూజిక్ కంపోసర్స్ తో చేయించారని సమాచారం.
కాగా చిత్ర యూనిట్ సమచారం ప్రకారం రాణా ఇందులో ప్రొఫిషినల్ కిల్లర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలియానా ఇంతకు ముందెన్నడూ చేయనంతంగా తన బెస్ట్ ఫెర్ఫామెన్స్ ఇందులో కనబరిచిందని, అలాగే ముమైత్ ఖాన్ మరియు అలీ ముక్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా కి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించగా నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. వచ్చే నెల ఎఫ్రిల్ 29న విడుదలకు సిద్దం చేస్తున్నారట.


Click it and Unblock the Notifications











