‘మై బంగారం బ్రదర్స్’ అంటున్న మెగా డాటర్ నిహారిక
మెగా డాటర్ నిహారిక రాఖీ సెలబ్రేషన్స్ జరుపుకుంది. అనంతరం ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
మెగా డాటర్ నిహారిక రక్షాబంధన్ సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. హ్యాపీ రక్షా బంధన్ టు ఆల్... లవింగ్, ప్రొటెక్టివ్, ఫన్నీ, కేరింగ్, బాస్సీ, క్యూటెస్ట్ అండ్ ట్రుబల్ మేకింగ్ బ్రదర్స్ అంటూ ఆమె చేసిన పోస్టుకు వేలల్లో లైక్స్ వచ్చాయి.
మై బంగారం బ్రదర్స్ తో ఈ రోజు టైమ్ సూపర్గా గడిచిందని ఆమె పేర్కొన్నారు. వరుణ్ తేజ్, రామ్ చరణ్ కు రాఖీ కడుతున్న ఫోటోను ఆమె షేర్ చేశారు.
సినిమాల విషయానికొస్తే.... నిహారిక 'ఒక మనసు' సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన సంగతి తెలిసిందే. తొలి సినిమా బాక్సాఫీసు వద్ద పెద్దగా వర్కౌట్ కాక పోయినా నిరహారికకు నటన పరంగా మంచి గుర్తింపే తెచ్చి పెట్టింది. చిన్న బ్రేక్ తర్వాత నిహారిక రెండో సినిమా మొదలైంది. ఈ సినిమాకు కొత్త దర్శకుడు రవి దుర్గా ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఎంఆర్ ఎంటర్టన్మెంట్స్, కవితా కంబైన్స్ బేనర్లో ఈచిత్రం తెరకెక్కుతోంది. బండారు బాబీ, మరిశెట్టి రాఘవయ్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో లేడు. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications











