Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కాజల్ చెల్లెలు కూడా మొత్తానికి పట్టాలు ఎక్కింది
స్టార్ హీరోయిన్ కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ హీరోయిన్ గా తెరంగ్రేటం చేస్తుందని గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ వార్తలను నిజం చేస్తూ ఆమె వరుణ్ సందేశ్ ప్రక్కన హీరోయిన్ గా సెలక్ట్ అయింది. సంపత్ నంది అనే రచయిత దర్శకుడుగా పరిచయం అవుతూ చేస్తున్న ఈ చిత్రం రీసెంట్ గా లాంచ్ అయింది. జూన్ 21 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. శ్రీసత్యసాయి ఆర్ట్స్ సంస్థ పతాకంపై కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్బంగా రాధామోహన్నిర్మాత మాట్లాడుతూ "కొత్తతరహాలో సాగే ప్రేమ కథ ఇది. హీరో, హీరోయిన్స్ పాత్రలు తప్పకుండా యూత్ కి నచ్చుతాయి" అన్నారు.
రాధామోహన్ ఇంతకుముందు సముద్ర దర్శకత్వంలో జగపతి బాబు హీరోగా అధినేత చిత్రాన్ని నిర్మించారు. అది బాక్సాపీస్ వద్ద భోల్తా కొట్టింది. ఇక ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ఎమ్మెస్ నారాయణ, ప్రగతి, గురురాజ్ తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: ఆదివిల్లి రామకృష్ణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎమ్.ఎస్.కుమార్, ఛాయగ్రహణం: బుజ్జి, సంగీతం: చక్రి అందిస్తున్నారు. తొలిసారిగా తెరపై హీరోయిన్ గా కనిపించనున్న నిషా అగర్వాల్ తన అక్క లాగానే నిలదొక్కుకోవాలని కోరుకుందాం.