Don't Miss!
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
స్టార్ హీరోలతో చెయ్యాలని లేదని తేల్చి చెప్పింది
నిత్యామీనన్ మాట్లాడుతూ.. 'ఏమిటో ఈ మాయ' చిత్రీకరణ పూర్తయింది. విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. శ్రీప్రియ దర్శకత్వంలోని '2 ఫిమేల్ కోట్టయం' అనే మలయాళ రీమేక్లో నటిస్తున్నా. అల్లరి అమ్మాయి పాత్రలే పోషిస్తున్నారేంటని అడుగుతున్నారు. ప్రతి హీరోయిన్ అలాంటివే ఇష్టపడుతోంది. ఆ పేరు నుంచి బయటపడాలని భిన్నమైనవి ఎంచుకోవాలనుకుంటున్నా..అంది.
అలాగే హీరోయిన్ కి కీలకంగా ఉండే కథల్ని ఎంపిక చేసుకుంటున్నా. 'అలా మొదలైంది'లో హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. ఇటీవల 'అప్పా' అనే చిత్రంలో మేకప్ లేకుండా నటించా. అగ్రస్థానానికి ఎదగాలంటే పెద్ద హీరోల సరసన నటిస్తేనే సాధ్యమవుతుందనుకోవడం నిజం కాదు. మనం ప్రదర్శించే నటనే పేరు ప్రఖ్యాతులను తీసుకొస్తుందని అభిప్రాయపడింది.
తెలుగులో అందుకున్న విజయాల్లాంటివి తమిళంలో రాలేదనే బెంగతో ఉంది నటి నిత్యమీనన్. 'సెగ', '180' చిత్రాలు నిరాశ పరచటంతో ఆవేదన చెందుతోంది. అయినా 'ఏమిటో ఈ మాయ' చిత్రంతో అక్కడా నిలదొక్కుకుంటాననే నమ్మకం వ్యక్తం చేస్తోంది.
చేరన్ దర్శకుడిగా తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న చిత్రం 'ఏమిటో ఈ మాయ'. శర్వానంద్, నిత్యమీనన్ జంటగా నటించారు. స్రవంతి రవికిషోర్ నిర్మాత. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
వృత్తి, ఉద్యోగ జీవితం.. అంటూ నేటి యువత ఉరుకులు.. పరుగులు పెడుతోంది. అనుబంధాలు, ఆత్మీయతలకు దూరంగా పరిగెడుతున్న వారు ఏం కోల్పోతున్నారో మా చిత్రంలో చూపిస్తున్నామంటున్నారు చేరన్.