Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఏది వల్గారిటి? బెల్లకొండ ఓపెన్ చాలెంజ్
హైదరాబాద్:
మారుతి
దర్శకత్వంలో
ప్రముఖ
నిర్మాత
బెల్లంకొండ
సురేష్
నిర్మించిన
చిత్రం
'బస్
స్టాఫ్'.
ఇటీవల
విడుదలైన
ఈ
చిత్రం
మంచి
సక్సెస్
టాక్
సొంతం
చేసుకుంది.
అయితే
ఈచిత్రంలో
వర్గారిటీ
ఉందని
ఆ
మధ్య
ఆందోళన
కార్యక్రమాలు
జరిగిన
విషయం
తెలిసిందే.
ఈ నేపథ్యంలో సోమవారం ఏర్పాటు చేసిన 'బస్ స్టాప్' సక్సెస్ మీట్లో ఓపెన్ చాలెంజ్ విసిరారు బెల్లంకొండ. సినిమాలో వల్గారిటీ ఉందనే దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని, థియేటర్ వచ్చి సినిమా చూస్తే సినిమాలో ఎలా ఉందో అర్థం అవుతుందని అన్నారు. మా సినిమా మంచి ఎంటర్ టైనరే కాదు... యూత్కి, పేరెంట్స్కి మంచి మెసేజ్ ఇచ్చే సినిమా అని బెల్లంకొండ చెప్పుకొచ్చారు.
ఈ సినిమాను తమిళ, కన్నడ, హిందీలో నిర్మిస్తాను అని చెప్పిన బెల్లంకొండ... మారుతి ఖాళీగా ఉంటే అతనికే దర్శకత్వం చేసే అవకాశం ఇస్తాను అని స్పష్టం చేసారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ నేను ఈ కథను నాలుగేళ్ల క్రితం రాసుకున్నాను. చాలా మంది నిర్మాతలను కలిసినా ఎవరూ ముందుకు రాలేదు. ఈ రోజు ఈ సినిమా 300 థియేటర్లలో విడుదలై విజయం సాధించిందంటే ఇదంతా బెల్లంకొండ సురేష్ గారి క్రెడిటే అన్నారు.
ఈ కార్యక్రమంలో బెల్లంకొండ గణేష్ బాబు, బిఎ రాజు, మహేంద్రరెడ్డి, సంగీత దర్శకుడు జీవన్ బాబు, ప్రిన్స్, శ్రీ దివ్య, రాంబాబు, ఎఫ్.ఎం బాబాయ్, హాసిక, ఏలూరు శ్రీను, సాయి, గోపాల సాయి, ఖన్నా, శశాంక్ తదితరులు పాల్గొన్నారు.