Don't Miss!
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
షారుఖ్ ఖాన్ తో మాట్లాడాలంటే ఈ నెంబర్
ఏ ఫోన్ ద్వారానైనా, ఏ నెట్వర్క్నుంచైనా, ఏ సమయంలోనైనా ఎవరైనా తనను తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ఫాలో అయ్యే వినూత్న కార్యక్రమానికి ఆద్యుడయ్యారు షారుఖ్. షారుఖ్ఖాన్తో అభిప్రాయాల్ని పంచుకోవాలనుకుంటున్న అభిమానులు, ఆయన భావాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అనుకుంటున్నారు... ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఆయన అందుబాటులోకి రావటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి ఉచితంగా అందించే ఈ సేవలను ట్విట్టర్ అకౌంట్ లేకుంటే డేటా ఎనేబుల్డ్ ఫోన్ ఉన్నా లేకపోయినా, ఏ ఫోన్ ద్వారానైనా, ఏ ఆపరేటర్ నెట్వర్క్తోనైనా మొబైల్ వినియోగదారులు షారూఖ్ ఖాన్ను ఫాలో కావచ్చని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.
షారూఖ్ ఖాన్ మాట్లాడుతూ " ఈ మధ్య కాలంలో నా అభిమానులకు చేరువయ్యేందుకు ట్విట్టర్ ఓ అద్భుత వేదికగా మారింది. భారతదేశంలోని నా అభిమానులంతా కూడా నాతో అనుసంధానమయ్యేందుకు ఈ నూతన సేవను వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించడంలో నాకు సహకరిస్తున్నందుకు అలాగే ట్విట్టర్ యాక్సెస్ లేని యావత్ జాతీయ వీక్షకులను ఒక్కచోటుకు చేర్చడంలో తోడ్పడుతున్నందుకు జిప్ డయల్, ట్విట్టర్ ఇండియాకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అతి త్వరలోనే ఇది పలు దేశాలకు, భాషలకు, ప్లాట్ఫామ్స్కు చేరుకుంటుందని ఆశిస్తున్నాను" అని అన్నారు.
ఇక షారుక్ ఖాన్, దీపిక పదుకొనె జంటగా రూపొందిన 'చెన్నై ఎక్స్ప్రెస్' మూవీ సూపర్ కలెక్షన్లతో గత రికార్డులు బద్దలు కొడుతూ బాక్సాఫీసు రేసులో ముందుకు సాగుతోంది. పాకిస్థాన్లోనూ ఈచిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పాకిస్థాన్లోని కరాచీలో కేవలం 8 స్క్రీన్లలో విడుదలైన ఈచిత్రం ఇప్పటి వరకు 40 మిలియన్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో కలెక్షన్ల విషయానికొస్తే....విడుదలై తొలి 10 రోజుల్లో ఈచిత్రం 181.93 కోట్ల రూపయాలు వసూలే చేసింది. తొలి వారంలో దుమ్మురేపే కలెక్షన్లు సాధించి బాక్సాపీసు వద్ద నెం.1 స్థానంలో నిలిచిన ఈచిత్రం....రెండో వారంలో 'వన్స్ ఎపానె టైం ముంబై దొబారా' చిత్రం విడుదల కారణంగా 2 స్థానానికి పడిపోయింది.