Don't Miss!
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సున్నతో జీవితం మొదలుపెట్టా...ఎన్టీఆర్
మేం ముగ్గురం సున్నతో జీవితాన్ని మొదలుపెట్టి ఈ స్థాయికి చేరుకున్న వాళ్ళం. అందుకే నాకు మామూలుగా దర్శకులంటే వినయ్, రాజమౌళి తప్ప ఇంకెవరూ కనిపించరు అన్నారు ఎన్టీఆర్. రీసెంట్ గా జరిగిన బృందావనం ఆడియో పంక్షన్ లో ఎన్టీఆర్ చెప్పిన ఈ మాటలు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఓ రేంజి స్ధాయికి రీచయినా ఎన్టీఆర్ ఇంకా తన తొలినాటి రోజులను గుర్తుచేసుకుని మాట్లాడటం అందరూ మెచ్చుకునేలా చేసింది. ఇక దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి డైరక్ట్ చేసిన ఈ చిత్రం పాటలు విడుదలైన తొలిరోజునే మంచి అమ్మకాలు జరిగి..మార్కెట్లో మంచి పేరు తెచ్చుకున్నాయి. అలాగే..నేనామధ్య ట్విట్టర్ లో..ప్రేమ్ రక్షిత్ స్టెప్పులతో చంపేస్తున్నాడు అని రాశాను. థమన్ అంత మంచి మ్యూజిక్ ఇస్తే అతను దానికి తగ్గ స్టెప్పులు వేయించకుండా ఎలా ఉండగలడు? అని ఎన్టీఆర్ మెచ్చుకున్నట్లే పాటలు ఉన్నాయంటున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కాజల్,సమంత నటించారు.