'కొత్త బంగారు లోకం'చిన్నది ఇన్నాళ్ళకి...
'కొత్త బంగారు లోకం'చిత్రంలో క్యూట్ కాలేజ్ గర్ల్ గా కనపడి అందరినీ ఆకట్టుకున్న శ్వేతాబసు ఆ తర్వాత అంతే వేగంగా ఫేడవుట్ అయిపోయింది. అయితే ఆమె నటించిన 'నువ్వెక్కడుంటే నేనక్కడుంటా"మాత్రం రిలీజ్ కాకుండా మిగిలిపోయింది.ఇన్నాళ్ళకు బిజెనెస్ పూర్తి చేసుకుని ఆగస్ట్ 12న విడుదలకు సిద్దపడుతోంది. ఉదయ్ కిరణ్, శ్వేతాబసు ప్రసాద్ జంటగా సుభాసెల్వం దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం లవ్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. ఇక నిర్మాణ సారథి సోమా విజయప్రకాష్ మాట్లాడుతూ ఉదయ్కిరణ్కి గత వైభవం తెచ్చిపెట్టే చిత్రమిది అన్నారు. ఉదయ్ కిరణ్ మాటేమో కానీ జూనియర్ నమిత గా మారిన శ్వేతాబసుని చూడ్డానికైనా ఎవరైనా ధైర్యం చేస్తారేమో చూడాలి.


Click it and Unblock the Notifications











