హాస్య నటుడు 'జుట్టు నరసింహం' మృతి

ఇక ఆయన భారతీయ భాషలే కాకుండా 'ఇండియన్ సమ్మర్' అనే హాలీవుడ్ సినిమాలోనూ నటించటం విశేషం. తమిళంలో ప్రముఖ దర్శకుడు విసు దర్శకత్వం వహించిన 'సంసారం అదు మిన్సారం' చిత్రంలో నటనకుగాను జాతీయ అవార్డు అందుకోవ డం విశేషం. తమిళనాడులోని కరూర్ జిల్లా, కట్టలై గ్రామంలో జన్మించిన ఆయన, 13వ ఏట 'అవ్వయార్' (1945-50) చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. చదువు పూర్తయ్యాక ఎల్ఐసీలో కొంతకాలం ఉద్యోగం చేశారు. తన గురువు, నటుడు సురుళి రాజన్ ప్రోత్సాహంతో 1969లో 'తిరు కళ్యాణం' తమిళ చిత్రంతో పునఃప్రవేశం చేశారు. నరసింహులుకు భార్య సరస్వతి(68), కుమార్తెలు విజయలక్ష్మి, నిర్మలతోపాటు కొడుకు కామేశ్వరన్ ఉన్నారు. అమెరికాలో ఉంటున్న కూతురు నిర్మల వచ్చాక, శనివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తామ ని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ధట్స్ తెలుగు హృదయపూర్వకంగా కోరుకుంటోంది.


Click it and Unblock the Notifications











