twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాండురంగడు విశేషాలు....

    By Staff
    |

    Pandurangadu
    మహారాష్ట్రలోని పండరీపుర స్థల పురాణమయిన భక్తుడు పుండరీకుని చరిత్రను తెరకెక్కించిన చిత్రం 'పాండురంగ మహత్మ్యం' . 'మాతాపితురుల సేవే మాథవ సేవ!' అన్న సూక్తిని ప్రపంచానికి తెలియచేసిన ఈ సినిమాలో స్వర్గీయ ఎన్టీఆర్ అనితర సాథ్యంగా నటించి చరిత్రలో నిలిచారు. ఇప్పుడా చిత్రం వచ్చియాభై ఏళ్ళు అయింది. ఈ స్వర్ణోత్సవ సంవత్సరంలో ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ నటించిన 'పాండురంగడు' విడుదలుకు సిద్దమవుతోంది. దాంతో ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ కే అంకితమిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని నిర్మాత, దర్శకుడు అయిన రాఘవేంద్రరావు తీసుకున్నారు. అంతే గాక విడుదలను పురస్కరించుకుని షోలాపూర్ సమీపాన కల పండరీపురానికి... పాండురంగడు ప్రింటుని తీసుకెళ్ళారు. అక్కడ పాండురంగడు పాద సన్నిధిలో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలుస్తోంది.

    ఈ చిత్రంలో బాలకృష్ణ పాండురంగడుగా ,పుండరీకుడుగాను రెండు పాత్రలలో కనిపించనున్నారు. టబు కథను కీలకమైన మలుపు తిప్పే వేశ్య పాత్రలో తన అందచందాలను ప్రదర్శించనుంది. ఇక స్నేహ భర్తని మార్చుకోవాలని ప్రయత్నించే చక్కని గృహిణి పాత్రలో కనిపిస్తుంది. ఇక 'లక్ష్మీనరసింహ' తర్వాత సరైన హిట్టు లేని బాలకృష్ణకు ఈ సినిమా చాలా కీలకం. అయినా సినిమా బాగా వచ్చిందని.. కాసుల వర్షం కురిపించటం కాయమని... యూనిట్ వారు ఉషారుగా ఉన్నారు. ఎందుకంటే దర్శకుడు రాఘవేంద్రరావు భక్తిని, ముక్తిని, రక్తిని యోక కాలంలో పండించగల సమర్ధుడని వారి ధీమా. అంతేగాక తన తండ్రి సినిమాను రీమేక్ చేయటంతో ఆయన ఆశీస్సులు కూడా బాలకృష్ణ వెంటే ఉంటాయని అందరూ భావిస్తున్నారు. అన్ని హంగులతో రెడీ అయిన ఈ చిత్రం ఈ నెల 30 న ప్రపంచమంతా రిలజు అవుతోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X