Don't Miss!
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
'పంజా' ఆ విషయంలో ఫెయిలైనట్లే
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజా మొన్న శుక్రవారం విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వీకెండ్ లలో కలెక్షన్స్ ఎలా ఉన్నా పైరసీ విషయంలో మాత్రం పూర్తిగా ఫెయిలైనట్లే అంటున్నారు. నిర్మాతలు చిత్రం విడుదలకు ముందు భారీ ఎత్తుక అబిమానులను ఉద్దేశించి పైపరీని అరికట్టడంలో సహకరించాలంటూ ప్రకటనలు ఇచ్చారు. అంతేగాక కొన్ని వెబ్ సైట్స్ ను గుర్తించి వాటిలో అప్ లోడ్ చేసినట్లు ఉంటే తెలపాల్సింది అని చెప్పారు. కానీ ఆ విషయంలో సినిమా విడుదల అయ్యాక నిర్మాతలు పెద్దగా పట్టించుకోలేదని అభిమానులు ఆరోపిస్తున్నారు. చిత్రాన్ని ఆన్ లైన్ లోనూ, టోరెంట్స్ లోనూ పైరసి ప్రింట్స్ తో దొరుకుతోందని వారు అంటున్నారు.
అందువల్ల కొంతలో కొంత కలెక్షన్స్ తగ్గిపోయే ప్రమాదం ఉందంటున్నారు. మొన్న దూకుడు చిత్రానికి నిర్మాతలు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా ఈ పంజా విషయంలో తీసుకోవటం లేదని చెప్తున్నారు. దానికి తోడు నిర్మాతలు సినిమా విడుదల అయ్యాక అస్సలు మీడియా ముందుకు వచ్చి కలెక్షన్స్ ప్రకటించటం వంటివి చేయలేదని, దాంతో ఎంత కలెక్షన్స్ వచ్చాయే తమ అభిమానులకు తెలియకుండాపోతోందని, మిగతా హీరోల సినిమాలకు కేవలం కలెక్షన్స్ హైలెట్ చేస్తూ మొదటి రోజు నుంచి ప్రకటనులు ఇవ్వటం చూసైనా నిర్మాతలు పబ్లిసిటీ ప్రారంబించి, పైరసీని ఆపి సినిమాని నిలబెట్టాలని కోరుకుంటున్నారు.