మాస్ హీరో గోపీచంద్ నెక్ట్స్ ఆ డైరక్టర్ తో..
పూరీ జగన్నాధ్ గోలీమార్ తో బిజీగా ఉన్న గోపీచంద్ తాజాగా మరో చిత్రానికి కమిట్ అయ్యారు. యువత, ఆంజనేయులు చిత్రాలు రూపొందించిన పరుశరామ్ ఈ చిత్రానికి దర్శకుడు అని సమాచారం. రవిబాబు, భూమికలతో అమరావతి చిత్రం తీసిన ఆనందప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. ఇంతకు ముందు ఆనందప్రసాద్..గోపీచంద్ తో శౌర్యం చిత్రం రూపొందించారు. ఇక ఆంజనేయులు ఫెయిల్యూర్ తో గ్యాప్ తీసుకుని వినోదాత్మక కథతో పరుశరామ్ రెడీ అయినట్లు చెప్తున్నారు. ఇక పూరీ డైరక్ట్ చేస్తున్న గోలీమార్...ఎనకౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. ప్రియమణి...గోపీచంద్ సరసన చేస్తోంది.
గోపీచంద్ గోలీమార్ ప్రియమణి అమరావతి భూమిక శౌర్యం ఆంజనేయులు పరుశరామ్ gopichand golimaar priyamani amaravathi bhoomika parusuram


Click it and Unblock the Notifications