Don't Miss!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'శిరిడి సాయి'కి కథ ఇవ్వడం నా అదృష్టం
హైదరాబాద్: షిర్డీ సాయిగా నాగార్జున నటించిన శిరిడీ సాయి చిత్రం మొన్న(గురువారం)విడుదల అయిన సంగతి తెలిసిందే. బాబా సచరిత్ర ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్శ్ తో పాటు భక్త.డి.సురేష్కుమార్ కూడా సహ రచన చేసారు. ఈ సందర్బంగా... పరుచూరి బ్రదర్శ్ మాట్లాడుతూ.. సబ్ కా మాలిక్ ఏక్..అన్న శిరిడిసాయిని ఆంధ్రజనం తెరపెై చూసి.. సంతోషిస్తున్నారు. వేనోళ్ల కీర్తించబడుతున్న ఈ సినిమాకి కథ అందించిన భక్త డి.సురేష్ అభినందనీయుడు అన్నారు.
భక్త డి.సురేష్కుమార్ మాట్లాడుతూ '' పదహారు భాషల్లో సాయిపెై సినిమాలు, సీరియళ్లు వచ్చాయి. ఎందరో పరిశోధకులు కొత్త కోణాల్ని ఆవిష్కరించారు. అయినా సాయి గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత భక్తుల్లో ఉంటుంది. ఈ సినిమాకి కథ ఇవ్వడం నా అదృష్టం. ఏ రచయితెైనా తొలి చిత్రం విజయమవ్వాలని కలలు కంటాడు. కల ఫలించినపుడు కలిగే ఆనందం వర్ణనాతీతం'' అన్నారు.
'శిరిడి సాయి' చిత్రాన్ని 801 థియేటర్లలో విడుదలచేసారు. ఆంధ్రప్రదేశ్తో పాటు కర్నాటక, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, దుబాయి, న్యూజిలాండ్, యు.ఎస్. తదిరత ప్రాంతాల్లోకూడా విడుదల చేసారు. చాలా చోట్ల విడుదలకు ముందే థియేటర్లు శుభ్రపరచి, బాబా విగ్రహాలను ఏర్పాటు చేసారు .
నాగార్జున ఈ చిత్రం గురించి చెబుతూ ''బాబా జననం నుంచి జీవ సమాధి వరకూ ఉన్న అన్ని దశలనూ స్పృశించాం. నేటి తరంలో ఎంతోమంది సాయిబాబా బోధనలపై విశ్వాసం కలిగి ఉన్నారు. అందరికీ నచ్చేలా రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. సినిమాకు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది''అన్నారు.