Don't Miss!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
ఎన్టీఆర్ మాటతో రచయిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి..అతడి హృదయం పిండేశాడు!
పరుచూరి పలుకులు పేరుతో సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలని పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి పరుచూరి ప్రస్తావించారు. ఆది సినిమా సంగతులని పరుచూరి అభిమనులతో పంచుకున్నారు.
ఆది చిత్రం షూటింగ్ పూర్తయ్యాక ఎన్టీఆర్ రషెష్ చూసాడు. ఆ తరువాత ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ అన్న మాట నా కళ్ళలో నీళ్లు తిరిగేలా చేసిందని తెలిపాడు.
ఆది చిత్రాన్ని వినాయక్ ఎంత గొప్పగా తీశారో అంతే గొప్పగా ఎన్టీఆర్ నటించాడు అని పరుచూరి అన్నారు. ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ నన్ను పక్కకు పిలిచారు. ఎన్టీఆర్ వైపుగా వెళ్ళాను. మిమ్మల్ని బాబాయ్ అని పిలవచ్చా అని ఎన్టీఆర్ అడిగాడు.
ఆ మాటతో నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అని పరుచూరి అన్నారు. మీ తాత గారు, నాన్నగారు, బాబాయ్ అంతా నాకు సోదరులు లాంటి వారు. నీవి నన్ను బాబాయ్ అని పిలవచ్చు అని తాను ఎన్టీఆర్ తో అన్నట్లు పరుచూరి గుర్తు చేసుకున్నారు. ఆది చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.