Just In
- 1 hr ago
పబ్లిక్ ప్లేస్లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్తో రెచ్చిపోయిన శ్రియ
- 1 hr ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
- 1 hr ago
ఆ సినిమా కోసం అలా.. ఇన్నాళ్లకు తెర ముందుకు బీ గోపాల్
- 2 hrs ago
నాగార్జున నుంచి బిగ్ సర్ప్రైజ్: ‘వైల్డ్ డాగ్’ ట్రైలర్కు డేట్ ఫిక్స్ చేసిన యూనిట్
Don't Miss!
- Finance
బిట్కాయిన్ వ్యాల్యూ 4.2 శాతం జంప్, 50,948 డాలర్లకు..
- News
నేను అల్లాటప్పా పామును కాదు, కోబ్రాను! ఒక్క కాటు చాలు: మిథున్ చక్రవర్తి సంచలనం
- Sports
అయితే మీరే మారండి.. హర్ష భోగ్లేకు రిషభ్ పంత్ పంచ్! వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మా కుటుంబానికి పెద్దదిక్కు చిరంజీవే: పసుపులేటి రామారావు భార్య
సీనియర్ జర్నలిస్ట్, సినీ పీఆర్వో పసుపులేటి రామారావు మరణంతో సినీ లోకంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. నిన్న (మంగళవారం) ఉదయం ఆయన మరణించారు. పసుపులేటి రామారావు మరణవార్త తెలిసిన వెంటనే చిరంజీవి సహా మోహన్ బాబు, నాని, సాయి ధరమ్ తేజ్, పలువురు ఇతర సినీ ప్రముఖులు స్పందిస్తూ సంతాపం తెలియజేశారు.
నిన్న సాయంత్రం పసుపులేటి రామారావు మృతదేహాన్ని తన స్వగృహానికి తీసుకొచ్చి నేడు (బుధవారం) అంత్యక్రియల కార్యక్రమం చేపట్టారు కుటుంబ సభ్యులు. రామారావు మృతి చెందటంతో కన్నీరుమున్నీరైంది ఆయన భార్య వెంకటలక్ష్మి. ఆమెను ఓదార్చుతూ దైర్యం చెప్పారు మెగాస్టార్ చిరంజీవి.

బాధలో ఉన్న వెంకటలక్ష్మి.. తమ కుటుంబానికి పెద్దదిక్కు మెగాస్టార్ చిరంజీవేనని చెప్పింది. రామారావు అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాల నిమిత్తం చిరంజీవి లక్ష రూపాయల నగదు తనకు ఇచ్చినట్లు ఆమె చెప్పింది. గతంలో కూడా చిరంజీవి పలుమార్లు తమ కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారని తెలిపింది. రామారావు రాసిన పుస్తకాల ప్రచురణ నిమిత్తం కూడా చిరంజీవి ఆర్థిక సహాయం రూపంలో సహకారం అందించారని చెప్పింది. ఇకముందు కూడా తమ కుటుంబానికి అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారని, ఆయనకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని వెంకటలక్ష్మి పేర్కొంది.