Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హాట్ టాపిక్ : పవన్ కల్యాణ్ పై కుట్ర వారిదా?
హైదరాబాద్ : ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో కాదు యావత్ ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు సినిమా అభిమానులందరికీ ఒకటే హాట్ టాపిక్ గా మారింది. ఎవరా...కుట్రదారుడు..పవన్ కళ్యాణ్ ని కుట్ర చేసి దెబ్బ కొట్టాలని ప్రయత్నించింది ఎవరు అనేదే...ఎవరికి తోచిన విధంగా వారు సమాధానాలు ఇచ్చుకుంటున్నారు. ఒక హీరో అని కొంతమంది కాదని మరికొంతమంది...ఓ నిర్మాత అని కొంతమంది..కాదని కొంతమంది ఇలా పజిల్ పూర్తి చేసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. అసలు ఎవరు ఆ కుట్ర దారుడు...తమ సినిమా మాత్రమే ఆడాలని భావిస్తూ...ఎదుటి వారి సినిమా ఫ్లాఫ్ కావాలని కావాలని పైరిసీని ఎంకరేజ్ చేసిన దుర్మార్గుడు అనేది పవన్ అభిమానుల్లో పెద్ద ప్రశ్న. మీడియా వ్యక్తుల్లోనూ రకరకాల ఆలోచనలు ఈ విషయమై రేగుతున్నాయి. అయితే ఎవరూ ధైర్యం చేసి ఫలానా అని చెప్పలేకపోతున్నారు.
ఇది ఒక రోజుతో అవదు..పోలీసు శాఖ పట్టుకుంది..బయిటకు కనిపించిన వ్యక్తులనే కానీ... పైరసీ చేయించిన వ్యక్తులను..ఇది పైరసీ కాదు..కాన్ స్పిరసీ(కుట్ర). దానికి కారణం... రెండు నెలలు నిజంగా పైరసీ చేయదలుచుకుంటే...వాళ్ళు రెండు నెలలు అలా ప్రింట్ తమ దగ్గర పెట్టుకు కూర్చోరు. ఎవరి మాటైతే విని పైరసీ చేసారో.. వాళ్లను నేను సభాముఖంగా హెచ్చరిస్తున్నాను... ఈ పైరసీని.. ఎవరైతే చేయమని ప్రోత్సహించారో..రాబోయే సంవత్సరంలో అందరినీ పేరు పేరునా గుర్తు పెట్టుకుంటాను. వీళ్లు ఏ స్ధాయి వ్యక్తులైనా గానీ..ఎలాంటి వాళ్లైనా గానీ.. ఎలాంటి న్యాయం జరగాలో అలాంటి న్యాయం జరిగాలో నేను చేస్తాను అంటూ పవన్ ఘాటుగా వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ అంత ఖచ్చితంగా... ధీమాగా తాట తీస్తా అని హెచ్చరించేసరికి అందరూ షాకయ్యారు. దాదాపు నలభై నిముషాలు సేపు సాగిన ఆ ప్రసంగం చాలా భావోద్వేగంగా సాగింది. తన దగ్గర ఖచ్చితమైన ఆధారాలు లేకపోతే పవన్ అలా రెస్పాండ్ కాడు అంటున్నారు. ఈ సినిమా సక్సెస్ అయ్యిందని నేను మర్చిపోతానని అనుకుంటే అది తప్పు...అది జరగని పని...చేద్దాం..ఒక రోజు అందరికీ చేద్దాం..ఎవరినీ వదలద్దు..ఎవరినీ వదలను...ప్రేమిస్తాం...భరిస్తాం...భరిస్తాం..అవసరమైతే తాట కూడా తీస్తాం...కానీ పరిస్ధితులు..సమాజం..పట్ల గౌరవం కానీ గబుక్కున వదులుకోబుద్దేయదు.. ఓ మాట జారనివ్వదు. ఇది నిగ్రహం తప్ప..చేతకాని తనం కాదు... అంటూ పవన్ చాలా ఎమోషన్ లా మాట్లాడారు.
పవన్కల్యాణ్ హీరోగా నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం విజయోత్సవ వేడుక నగరంలోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పవన్కల్యాణ్ మాట్లాడుతూ విడుదలకు ముందే పైరసీకి గురైన ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన అభిమానులను అభినందించారు. ఈకార్యక్రమానికి త్రివిక్రమ్ శ్రీనివాస్, నదియా., ప్రణీత, అలీతో పాటు చిత్ర బృందం హాజరయ్యారు. ఎప్పుడూ పెద్దగా మాట్లాడని పవన్ ఈ సారి చాలా ఎమోషనల్ గా పైరసీ మీద వ్యాఖ్యలు చేసారు. తాను ఎప్పుడూ ఎవ్వరితోనూ అంతతొందరగా కలవని, కానీ ఇవాళ మాట్లాడలని ఉందని ఎమోషనల్ గా మాట్లాడటం చాలా మందిని సస్పెన్స్ లో పడేసింది. కొంతమందికి మాత్రం ఖచ్చితంగా గుండెళ్లో రైళ్లు పరుగెత్తే ఉంటాయంటున్నారు.