Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పవన్ ఫ్యాన్స్ బెదిరింపు కాల్ పై ఎన్.శంకర్
హైదరాబాద్ : 'ఇంకోసారి నా కళ్యాణ్ని ఏమైనా అంటే నేను చచ్చినా ఫర్వాలేదు.. నిన్ను నరికే స్తా...నా...' ఇదీ ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్కు పవన్ కళ్యాణ్ అభిమానుల పేరిట వచ్చిన ఎస్సెమ్మెస్. ఇది 9492952695 నెంబర్ సెల్ నుంచి శంకర్ సెల్కు వచ్చింది. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం నిషేదించాలంటూ తను కోరటంపై తనను బెదిరిస్తున్నారంటూ ఎన్.శంకర్ మీడియాకు వివరించారు.
'నటుడు పవన్ కళ్యాణ్ అభిమానుల పేరిట నాకు బెదిరింపు ఎస్సెమ్మెస్లు వస్తున్నాయి. నన్ను చంపేస్తానని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధమే' అని దర్శకుడు ఎన్ శంకర్ తెలిపారు. టీజేఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
''పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను కించపర్చినట్లు నిర్మించడంపై నేను స్పందించా. ఆ సినిమాలోని పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశా. దీన్ని జీర్ణించుకోలేని ఆయన అభిమానుల పేరిట కొంతమంది నన్ను హతమారుస్తామంటూ సెల్ఫోన్కు ఎస్సెమ్మెస్లు పంపుతున్నారు. శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదో చాప్టర్లో భాగంగా కుట్రలన్నీ అమలవుతున్నాయి. నాకు హెచ్చరికలు చేసిన అభిమానులు చైతన్యంతో వచ్చి నాతో మాట్లాడాలి. వాస్తవాలను వివరిస్తా. ఆ తర్వాత నన్ను చంపినా అర్థం ఉంటుంది. అభిమానులను హీరోలు కాపలా కుక్కలుగా తయారు చేస్తున్నారు. వారి వలలో పడకండి'' అని శంకర్ సూచించారు.
'జుట్టు పట్టుకొని కొట్టుకున్న హీరోలంతా ఒక్కటయ్యారు. కనీసం ముఖం చూడ్డానికి కూడా ఒప్పుకోని హీరోలు వారి అభిమానులను ఏకం చేస్తూ ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. సీమాంధ్ర భావజాలాన్ని సినిమాల్లో రుద్దడం, తెలంగాణవాదులను గందరగోళానికి గురి చేయడం, తెలంగాణవాదులను అవహేళన చేయడం, తెలంగాణవాళ్లను వికృతరూపంలో చిత్రీకరించడం వంటి ఘటనలకు సినీరంగం వేదికగా మారుతోంది. తెలంగాణలో సాంస్కృతిక విధ్వంసాన్ని సాగిస్తున్నారు. సాంస్కృతిక ఉద్యమాన్ని ఊరూ, వాడా తీసుకెళ్తా..' అని శంకర్ చెప్పారు.
తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తూ తీసిన రాంబాబు సినిమాను పూర్తిగా నిషేధించాలని దర్శకుడు శంకర్ డిమాండ్ చేశారు. డిస్ట్రిబ్యూటర్స్కు వచ్చే నష్టాన్ని దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో పవన్ కల్యాణ్ భరించాలన్నారు. నిర్మాత దిల్రాజు తెలంగాణకు చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు.