ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ 35 లక్షల గిప్ట్ (ఫొటోలు)
హైదరాబాద్ : ఎన్టీఆర్ ఎప్పుడూ ఎవరో ఒకరికి సరదాగా అందరికి గిప్ట్ లు ఇస్తూ ఆనందపరుస్తూంటారని పేరు. ఆయన గతంలో పూరి జగన్నాథ్, శ్రీనువైట్లలకు ఖరీదైన గిప్ట్ లు ఇచ్చారు. అలాంటి ఆయనకు ఓ ఖరీదైన గిప్ట్ ని ఆయన అభిమానులు ఇచ్చారు.
అనంతపూర్ నుంచి వచ్చిన ఎన్టీఆర్ అభిమానులు ఆయనకు 35 లక్షలు విలువ చేసే వెడ్డింగ్ శారీని గిఫ్ట్ గా ఇచ్చారు. బంగారు తీగలతో అల్లిన చీర అది. అన్నగారు నందమూరి తారకరామారావు , ఆయన భార్య బసవతారకం ఫొటోలను ఆ చీరలో పెయింట్ చేసారు.
ఈ చీరను చూడగానే ఎన్టీఆర్ చాలా ఎక్సైట్ అయ్యారు. ఆ గిప్ట్ తెచ్చిన ఫ్యాన్స్ తో గడిపి వారకి కృతజ్ఞతలు తెలియచేసారు. ఇలాంటి అరుదైన గిప్ట్ ని అందుకోవటం తనకు ఆనందపరిచిందని అన్నారు.
ఆ సందర్బంలో తీసిన ఫొటోలు ఇక్కడ చూడండి...

ఎక్సైట్ మెంట్
చీరను చూసిన ఎన్టీఆర్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది

అభిమానులతో
తనకు ఉన్న అభిమానులే సంపద అని ఆయన మురిసిపోయారు

ఫ్యాన్స్ కూడా
ఈ చీర ఇవ్వటానికి వచ్చిన అభిమానలు తమతో ఎన్టీఆర్ గడపటం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు.

ప్రేమ,అభిమానం
ఎన్టీఆర్ పై తమకు ఉన్న ప్రేమ, అబిమానమే ఈ చీర డిజైనింగ్ కు ప్రేరణ ఇచ్చిందన్నారు.

పెద్దాయన ఆశీస్సులు
చీరపై ఎన్టీఆర్, బసవతారకం ఫొటోలు డిజైన్ చేయటం వారి ఆశిస్సులు పొందటం లాంటిది

ఫొటోలు
ఈ సందర్బంగా ఎన్టీఆర్ తన అభిమానులతో ఫొటోలు దిగారు

అదే లుక్
నాన్నకు ప్రేమతో చిత్రం కోసం ఉన్న లుక్ తో కనిపించారు ఎన్టీఆర్

కాస్సేపు
తన తాజా చిత్రం గురించి కూడా అబిమానులతో ముచ్చటించారు

హ్యాపీగా
అభిమానులు ఈ సందర్బంగా ఎన్టీఆర్ ని కలవటం చాలా హ్యాపీగా ఫీలయ్యారు

తాజా సమచారం
నాన్నకు ప్రేమతో చిత్రం కోసం ఎన్టీఆర్ త్వరలో స్పెయిన్ వెళ్లనున్నారు.


Click it and Unblock the Notifications











