Don't Miss!
- News కొడాలి నాని సంచలన కామెంట్స్..ఎన్నికల్లో పోటీ చేయనంటూ
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
విచ్చలవిడిగా మహేష్ '1' పైరసీ, చెర్రీ 'ఎవడు' కూడా
విజయవాడ/హైదరాబాద్: పైరసీ రక్కసి చిత్ర నిర్మాతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన మహేశ్ బాబు '1 నేనొక్కడినే', రామ్ చరణ్ తేజ 'ఎవడు' చిత్రాలకు పైరసీ ఆందోళన కలిగిస్తోంది. విజయవాడలో 1 నేనొక్కడినే చిత్రం పైరసీలను గుర్తించారు.
నిన్నటి నుండి ఈ సినిమా పైరసీ సిడిలు విచ్చలవిడిగా మార్కెట్లుకి వచ్చాయని ఆందోళన చెందుతున్నారు. ఎవడు చిత్రం పైరసీ సిడిలను కూడా మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి డౌన్లోడ్ పాస్ వర్డ్ను కూడా విడుదల చేశారట.
గతంలో అత్తారింటికి దారేది చిత్రం మూవీ విడుదలకు ముందే బయటకు రావడం సంచలనం సృష్టించింది. బెజవాడ కేంద్రంగా పైరసీ సిడిలు బయటకు వస్తున్నాయంటున్నారు. పైరసీ మాఫియా.. టాప్ హీరోల చిత్రాలు విడుదలైన వెంటనే మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి.
కాగా, రామ్ చరణ్ తేజ హీరాగా నటించిన 'ఎవడు' చిత్రం ఆదివారం విడుదల కాగా, ప్రిన్స్ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే చిత్రం మూడు రోజుల క్రితం విడుదలయింది.